నేపాల్లో కుప్పకూలిన విమానం.. అందులో 22 మంది ప్రయాణికులు.. నలుగురు భారతీయులు
నేపాల్లో ఓ విమానం కూలిపోయింది. అదీ 43 ఏళ్ల పాటు సేవలు అందించిన ప్రైవేట్ ఎయిర్ లైన్.. ఆదివారం 22 మంది ప్రయాణికులతో మొదలైంది. టేకాఫ్ అయిన 15 నిమిషాలకే గ్రౌండ్ కంట్రోల్తో సంబంధాలు తెగిపోయాయి. ఆ విమానం ముస్తాంగ్ జిల్లాలో గల కొవాంగ్లో పడిపోయింది. దాని అడ్రస్ చివరకు కనుగొగలిగారు.
తారా ఎయిర్ విమానం మనపతి హిమాల్ కొండచరియ కొంద గల లాంచే నది వద్ద కూలిపోయిందని స్థానికులు నేపాల్ ఆర్మీకి సమాచారం అందజేశారు. భూ, వాయు మార్గం ద్వారా ఆర్మీ సంఘటనా స్థలం వద్దకు చేరుకోనుంది. ఉదయం 9.55 గంటలకు విమానం బయల్దేరగా.. ఉదయం 10.07 గంటలకు సంబంధాలు తెగిపోయాయి. వెంటనే నేపాల్ ఆర్మీ హెలికాప్టర్ రంగంలోకి దిగింది. 10 మంది సైనికులు.. ఇద్దరు అధికారులతో బయల్దేరింది.

నేపాల్ లో 22 మందితో ప్రయాణిస్తున్న విమానం కూలిపోయింది. తారా ఎయిర్ కు చెందిన ఈ విమానం ఉదయం 9.55 గంటలకు పోఖారాలో టేకాఫ్ తీసుకుంది. 15 నిమిషాల తర్వాత ఈ విమానం గ్రౌండ్ కంట్రోల్ తో సంబంధాలు కోల్పోయింది. దాంతో ఈ విమానం కోసం తీవ్ర స్థాయిలో గాలింపు చేపట్టారు. చివరికి కోవాంగ్ గ్రామం సమీపంలో లామ్చే నది వద్ద కూలిపోయినట్టు గుర్తించారు. విమాన ప్రమాదంపై సమాచారం అందుకున్న నేపాల్ ఆర్మీ సంఘటన స్థలానికి బయల్దేరింది. ఈ విమానంలో 19 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో నలుగురు భారతీయులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications