నేపాల్లో కుప్పకూలిన విమానం.. అందులో 22 మంది ప్రయాణికులు.. నలుగురు భారతీయులు
నేపాల్లో ఓ విమానం కూలిపోయింది. అదీ 43 ఏళ్ల పాటు సేవలు అందించిన ప్రైవేట్ ఎయిర్ లైన్.. ఆదివారం 22 మంది ప్రయాణికులతో మొదలైంది. టేకాఫ్ అయిన 15 నిమిషాలకే గ్రౌండ్ కంట్రోల్తో సంబంధాలు తెగిపోయాయి. ఆ విమానం ముస్తాంగ్ జిల్లాలో గల కొవాంగ్లో పడిపోయింది. దాని అడ్రస్ చివరకు కనుగొగలిగారు.
తారా ఎయిర్ విమానం మనపతి హిమాల్ కొండచరియ కొంద గల లాంచే నది వద్ద కూలిపోయిందని స్థానికులు నేపాల్ ఆర్మీకి సమాచారం అందజేశారు. భూ, వాయు మార్గం ద్వారా ఆర్మీ సంఘటనా స్థలం వద్దకు చేరుకోనుంది. ఉదయం 9.55 గంటలకు విమానం బయల్దేరగా.. ఉదయం 10.07 గంటలకు సంబంధాలు తెగిపోయాయి. వెంటనే నేపాల్ ఆర్మీ హెలికాప్టర్ రంగంలోకి దిగింది. 10 మంది సైనికులు.. ఇద్దరు అధికారులతో బయల్దేరింది.
నేపాల్ లో 22 మందితో ప్రయాణిస్తున్న విమానం కూలిపోయింది. తారా ఎయిర్ కు చెందిన ఈ విమానం ఉదయం 9.55 గంటలకు పోఖారాలో టేకాఫ్ తీసుకుంది. 15 నిమిషాల తర్వాత ఈ విమానం గ్రౌండ్ కంట్రోల్ తో సంబంధాలు కోల్పోయింది. దాంతో ఈ విమానం కోసం తీవ్ర స్థాయిలో గాలింపు చేపట్టారు. చివరికి కోవాంగ్ గ్రామం సమీపంలో లామ్చే నది వద్ద కూలిపోయినట్టు గుర్తించారు. విమాన ప్రమాదంపై సమాచారం అందుకున్న నేపాల్ ఆర్మీ సంఘటన స్థలానికి బయల్దేరింది. ఈ విమానంలో 19 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో నలుగురు భారతీయులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.