నేపాల్ విమాన ప్రమాదం: అదుపుతప్పి గాలిలో ఇలా.., వీడియోలు వైరల్
ఖాట్మాండ్: నేపాల్లోని పోఖారా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో 72 సీట్ల ప్యాసింజర్ విమానం కుప్పకూలడంతో అందులోని 68 ప్రయాణికులతోపాటు నలుగురు మృతి చెందారు. అయితే, విమానం అదుపుతప్పడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు చెబుతున్నారు. ప్రమాదానికి ముందు విమానంకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది.
ఖాట్మండు వెళ్లే విమానం విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన 20 నిమిషాలకే క్రాష్ అయినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. విమానం కూలిపోయే ముందు క్షణాల ముందు తీసిన వీడియో క్లిప్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఒక వీడియోలో.. విమానం మధ్య గాలిలో బ్యాలెన్స్ కోల్పోయి, పెద్ద శబ్ధంతో నేలకు కూలినట్లు కనిపించింది. మరో క్లిప్లో కూలిపోయిన విమానం నుంచి పొగలు రావడంతో భారీ మంటలు కనిపిస్తున్నాయి. అయితే స్థానికులు, సహాయక బృందాలు ప్రయాణికులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
రెస్క్యూ టీమ్లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న క్లిప్ను వార్తా సంస్థ ఏఎన్ఐ షేర్ చేసింది.
Horrifying last moments of an ATR plane crash from Nepal in Pokhara that was bound for Kathmandu. All 72 people on board are dead. pic.twitter.com/4JZIvnThPQ
— Wajahat Kazmi (@KazmiWajahat) January 15, 2023
విమానంలో మొత్తం 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. పాత విమానాశ్రయం, పోఖారా అంతర్జాతీయ విమానాశ్రయం మధ్య ఈ విమానం కూలిపోయిందని యతి ఎయిర్లైన్స్ అధికార ప్రతినిధి సుదర్శన్ బర్తౌలా ఖాట్మండు పోస్ట్కి తెలిపారు.
#Pokhara Nepal Plane Crash -#नेपाल के #पोखरा में प्लेन क्रैश
— Vaibhav Raj Shukla (@VaibhavRjShukla) January 15, 2023
कुल 72 लोग सवार थे 16 से ज़्यादा शव बरामद
---#Nepal #planecrash pic.twitter.com/m2woikcifB
విమాన శిథిలాలు మంటల్లో ఉన్నాయని, రెస్క్యూ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానిక అధికారి గురుదత్తా ధాకల్ తెలిపారు. రాయిటర్స్ ప్రకారం.. విమానంలో ఐదుగురు భారతీయులతో సహా 15 మంది విదేశీ పౌరులు ఉన్నారు. విమానంలోని ప్రయాణికులందరూ మరణించారని నేపాల్ ప్రభుత్వం ధృవీకరించింది.