సైబర్ క్రైం, ఎన్నికల్లో జోక్యంపై చర్చలు: పుతిన్- బైడెన్ భేటీ
చిరకాల ప్రత్యర్థులు అమెరికా, రష్యా దేశ అధినేతలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. బైడెన్, పుతిన్ జెనీవాలో సమావేశం అయ్యారు. వీరిరువురు దశాబ్దకాలం తర్వాత కలుసుకోవడం విశేషం. చివరిసారిగా పుతిన్ ప్రధానిగా.. బైడెన్ ఉపాధ్యక్ష పదవిలో ఉన్న సమయంలో 2011 మార్చిలో సమావేశమయ్యారు. మరోవైపు ఇరు దేశాల మధ్య సంబంధాలు భారీగా క్షీణించిన సమయంలో వీరి భేటీ జరుగుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఉక్రెయిన్, మానవ హక్కులు, సైబర్ దాడులు, అమెరికా ఎన్నికల్లో రష్యా పాత్ర వంటి అంశాల్లో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇటీవల తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. మరోవైపు పుతిన్ను బైడెన్ కిల్లర్గా, సరైన ప్రత్యర్థిగా అభివర్ణిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా పాత్ర ఉందంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఈ తరుణంలో ఇరువురి మధ్య సమావేశాలు జరుగుతుండడంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.
సైబర్క్రైం, అమెరికా ఎన్నికల్లో జోక్యం సహా ఇరు దేశాల మధ్య సంబంధాల క్షీణతకు దారితీసిన పలు అంశాలపై రష్యాతో చర్చించేందుకు అవకాశంగా దీన్ని బైడెన్ అభివర్ణించారు. ఇరు దేశాల మధ్య సంబంధాల్ని బలోపేతం చేసుకోవడానికీ ఇదే అవకాశం అని అభిప్రాయపడ్డారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications