ఉగ్రనిధులకు కట్టడి: యూఎన్ తీర్మానం
వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్), ఆల్ ఖైయిదా వంటి ఉగ్రవాద సంస్థలకు వెలుతున్న నిధుల ప్రవాహాలను అడ్డుకోవాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం చేసింది. 15 సభ్య దేశాల ఆర్థిక మంత్రులు ఈ సమావేశంలో పాల్గోన్నారు.
ఉగ్రవాద సంస్థలకు నిధులు అందుతున్న పద్దతులు, తదితర అంశాలపై చర్చించారు. ప్రయివేటు సంస్థల ద్వారా ఉగ్ర నిధులు ప్రవాహం జరుగుతుందని దీనికి అంతర్జాతీయ సహకారంతోనే అడ్డుకట్ట వెయ్యాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానించింది.
పాకిస్థాన్ లో అమెరికా రాయబారిగా పని చేసిన రిచర్డ్ జీ ఒస్లోన్ మాట్లాడుతూ తాలిబన్ల పోరాటానికి పాకిస్థాన్ ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తుందని అన్నారు. భారత్, అఫ్ఘనిస్తాన్ దాడులకు పాక్ లోనే వ్యూహరచనలు చేస్తున్నారని, అయినా పాక్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు.
యుద్దం, హింసలు కారణంగా ఇళ్లు, ఊళ్లు, దేశాలు వదిలి నిర్వాసితులుగా, శరణార్థులుగా మారుతున్న వారి సంఖ్య ఏడాదికి ఆరు కోట్లు దాటిపోతుందని ఐక్యారాజ్య సమితి వెల్లడించింది. ప్రతి 122 మంది శరణార్థుల్లో ఒకరు నిర్వాసితుడిగానే, శరణార్థిగానో బతుకుతున్నారని తెలిపింది.