సైకిల్ పై నుంచి పడిపోయిన బైడెన్.. ఐయామ్ ఓకే అంటోన్న అగ్రరాజ్య అధినేత
అగ్రరాజ్య అధినేత జో బైడెన్ సైకిల్ పై నుంచి పడిపోయారు. డిలవెర్లో అమెరికా కాలమానం ప్రకారం శనివారం ఉదయం రైడ్ చేశారు. అయితే బైడెన్ మిగతా వారితో వచ్చారు. సైకిల్ ఆపారు. ఆ వెంటనే పడిపోయారు. సైకిల్ నుంచి పడిపోయిన తర్వాత వెంటనే ఆయన లేచారు. తాను బానే ఉన్నానని బైడెన్ తెలిపారు. రైడ్లో ఆయన భార్య కూడా జిల్ బైడెన్ కూడా పాల్గొన్నారు. బెహొబొత్ బీచ్ వద్ద గల బీచ్ హోమ్.. పార్క్ వద్ద సైకిల్ ఆపారు. తన భార్యతో మాట్లాడేందుకు ఆపి.. తర్వాత పడిపోయారు.
ఆయన పడిపోగానే చాలా మంది వచ్చారు. మీడియా ప్రతినిధులు, దగ్గరి సంబంధికులు చుట్టుముట్టారు. దీంతో ఆ ప్రాంతం రద్దీగా మారింది. బైడెన్ పడిన ప్రాంతంలో పగులు లేవని తెలిపారు. గాయాలు కాలేవని వైట్ హౌస్ ప్రతినిధులు తెలిపారు. వైద్య సాయం అవసరం లేదని పేర్కొన్నారు. తర్వాత బైడెన్.. తన కుటుంబంతో కలిసి గడిపారని పేర్కొంది.
బైడెన్ వయస్సు ఎక్కువ అయినందున.. అతని ఆరోగ్యం గురించి అధికారులు శ్రద్ద వహిస్తున్నారు. అయితే 2024లో మరోసారి పదవీని కోరతారా లేదా అనే సందేహాలు వస్తున్నాయి. కానీ మరోసారి.. ఆయనకు పదవీ కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అధికారం చేపట్టిన వెంటనే 2020 నవంబర్లో తన శునకంతో ఆడే సమయంలో కూడా గాయపడ్డారు. ఆ మరుసటి ఏడాది బైడెన్ ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు ధృవీకరించారు. చైనా వస్తువులపై ట్రంప్ వేసిన సుంకాలను సడలించే ప్రయత్నం చేస్తానని బైడెన్ తెలిపారు. దీనికి సంబంధించి త్వరలో జిన్ పింగ్తో సమావేశం అవుతానని తెలిపారు.