జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రతిజ్ఞ.!నగర పాలక సంస్థలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు.!
హైదరాబాద్: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని సంవిదాన్ దివస్ సందర్భంగా జీహెచ్ఎంసీ కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ ప్రధాన కార్యాలయంలో అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ కమిషనర్ సిబ్బందినుద్దేశించి ప్రసంగించారు. దేశ భవిష్యత్తును రూపొందించడంలో రాజ్యాంగంలోని ప్రియాంబుల్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నారు. నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవాన్నిసంవిధాన్ దివస్ గా జాతీయ న్యాయ దినోత్సవంగా ప్రతియేడు జరుపుకుంటున్నామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది, దేశాన్ని ఒకే తాటిపై నడిపించే రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, దాని ఫలాలను ప్రతిఒక్కరూ ఆస్వాదించాలని అన్నారు. భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ బాధ్యతగల పౌరులుగా ఎదుగాలన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్.

అంతే కాకుండా ప్రజల ఆర్థిక, సామాజిక జీవనప్రమాణాలు పెంపొందించడానికి దేశాన్ని ఒక సంక్షేమ రాజ్యంగా రూపొందించడానికి ప్రాదేశిక సూత్రాలు రాజ్యాంగంలో పొందుపరిచారని తెలిపారు. ఈ సమావేశంలో చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్ రెడ్డి, అడిషనల్ కమిషనర్ అడ్మిన్ సరోజిని, డైరెక్టర్ ప్లానింగ్ శ్రీనివాస్, సిపిఆర్ఓ ముర్తుజా, సిబ్బంది పాల్గొన్నారు. కాగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్ టిసి ఆధ్వర్యంలో డిసెంబర్ 2, 3 తేదీల్లో జరుగనున్న ఈ- అక్షన్ ఉందని, జంటనగరాలు, శివారు ప్రాంతాల డెవలపర్స్, బిల్డర్లు, చిన్న, పెద్ద రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారి కోరిక మేరకు మరోసారి "ఉప్పల్ భగాయత్ ప్రి-బిడ్ మీటింగ్" నిర్వహించాలని హెచ్ఎండిఏ నిర్ణయించిందని హెచ్ఎండీఏ అధికారులు నిర్ణయించారు. శనివారం(27న) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటగంట వరకు బేగంపేట్ లోని "టూరిజం ప్లాజా"లో హెచ్ఎండిఏ నిర్వహిస్తున్న ప్రి బిడ్ మీటింగ్ కి డెవలపర్లు, వారి ప్రతినిధులు, ప్లాట్లు కొనుగోలుకు ఆసక్తి కలిగిన వారు అందరూ హాజరు కావాలని హెచ్ఎండిఏ అధికారులు కోరారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications