నటి జీవితా రాజశేఖర్కు ఊరట: హైకోర్టుకు వెళ్తానని శేఖర్ రెడ్డి
హైదరాబాద్: చెక్ బౌన్స్ కేసులో సినీ నటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్కు ఊరట లభించింది. ఆమెపై ఉన్న చెక్ బౌన్స్ కేసును హైదరాబాదులోని ఎర్రమంజిల్ కోర్టు శనివారంనాడు కొట్టేసింది. ఈ సందర్భంగా జీవిత మాట్లాడారు.
తనను కోర్టుకు లాగినవారిపై పరువు నష్టం దావా వేస్తానని, కావాలనే తన దగ్గర నుంచి చెక్ తీసుకుని కేసులో ఇరికించారని ఆమె ఆరోపించారు. తనపై కేసును కొట్టివేయడం సంతోషంగా ఉందని అన్నారు.

జీవితా రాజశేఖర్ 2007లో ఎవడైతే నాకేంటి అనే సినిమాను నిర్మించారు. ఇందుకోసం సామ శేఖర్ రెడ్డి వద్ద రుణం తీసుకున్నారు. ఈ సందర్భంగా అతడికి ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది. దాంతో ఆయన కోర్టును ఆశ్రయించారు.
కేసును విచారించిన ఎర్రమంజిల్ కోర్టు 2014 జీవితకు రూ.25 లక్షల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత ఆమె బెయిల్పై విడుదలయ్యారు. శనివారం ఆ కేసులో కోర్టు తీర్పు వెలువరించింది. అయితే, తాను జీవితా రాజశేఖర్పై హైకోర్టుకు వెళ్తాననిి సమా శేఖర్ రెడ్డి చెప్పారు.
-
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్లో మల్టీప్లెక్స్ రూల్స్ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..?












Click it and Unblock the Notifications