నటి జీవితా రాజశేఖర్కు ఊరట: హైకోర్టుకు వెళ్తానని శేఖర్ రెడ్డి
హైదరాబాద్: చెక్ బౌన్స్ కేసులో సినీ నటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్కు ఊరట లభించింది. ఆమెపై ఉన్న చెక్ బౌన్స్ కేసును హైదరాబాదులోని ఎర్రమంజిల్ కోర్టు శనివారంనాడు కొట్టేసింది. ఈ సందర్భంగా జీవిత మాట్లాడారు.
తనను కోర్టుకు లాగినవారిపై పరువు నష్టం దావా వేస్తానని, కావాలనే తన దగ్గర నుంచి చెక్ తీసుకుని కేసులో ఇరికించారని ఆమె ఆరోపించారు. తనపై కేసును కొట్టివేయడం సంతోషంగా ఉందని అన్నారు.

జీవితా రాజశేఖర్ 2007లో ఎవడైతే నాకేంటి అనే సినిమాను నిర్మించారు. ఇందుకోసం సామ శేఖర్ రెడ్డి వద్ద రుణం తీసుకున్నారు. ఈ సందర్భంగా అతడికి ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది. దాంతో ఆయన కోర్టును ఆశ్రయించారు.
కేసును విచారించిన ఎర్రమంజిల్ కోర్టు 2014 జీవితకు రూ.25 లక్షల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత ఆమె బెయిల్పై విడుదలయ్యారు. శనివారం ఆ కేసులో కోర్టు తీర్పు వెలువరించింది. అయితే, తాను జీవితా రాజశేఖర్పై హైకోర్టుకు వెళ్తాననిి సమా శేఖర్ రెడ్డి చెప్పారు.
-
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications