పూవులిచ్చిన బాబు, శాలువా కప్పిన కెసిఆర్, 15రకాల ఆంధ్రా వంటకాలతో లంచ్
విజయవాడ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు బెజవాడ చేరుకున్నారు. ఆయనకు హెలిప్యాడ్ వద్ద మంత్రులు యనమల రామకృష్ణుడు, రావెల కిషోర్ బాబు, కామినేని శ్రీనివాస్ రావులు స్వాగతం పలికారు.
అనంతరం కెసిఆర్ చంద్రబాబు ఇంటికి వెళ్లారు. ఇంటి వద్ద ఏపీ సీఎం తెలంగాణ సీఎంను సాదరంగా ఆహ్వానించారు. పుష్పగుచ్ఛం ఇచ్చి కెసిఆర్ను చంద్రబాబు ఆహ్వానించారు. అనంతరం ఇంట్లో చండీయాగ ఆహ్వాన పత్రికను అందించారు. చంద్రబాబుకు కెసిఆర్ శాలువా కప్పి, జ్ఞాపికను అందించారు.

యాగంకు సంబంధించిన విషయాలను కెసిఆర్... బాబుతో చెప్పారు. ఆయన సాదరంగా విన్నారు. వారిద్దరు కాసేపు నవ్వుతూ మాట్లాడుకున్నారు. కెసిఆర్ అనుకున్న సమయానికి కంటే పావుగంట ఆలస్యంగా వచ్చారు. కెసిఆర్ వెంట మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీ బాల్క సుమన్ ఉన్నారు.
తెలంగాణ సీఎం కెసిఆర్ కోసం చంద్రబాబు పదిహేను రకాల వంటకాలు సిద్ధం చేయించారు. అందులో నాటుకోడి, చేపల పులుసు, గోంగూర, ముద్దపప్పు, కాకినాడ ఖాజా, ఉలవచారు, టమోటా పప్పు, మునక్కాయ సాంబారు, బిర్యానీ, గడ్డ పెరుగు, పూతరేకులు వంటి మిఠాయిలు, వివిధ రకాల పండ్ల ముక్కల్ని సిద్ధం చేశారు.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!!












Click it and Unblock the Notifications