పూవులిచ్చిన బాబు, శాలువా కప్పిన కెసిఆర్, 15రకాల ఆంధ్రా వంటకాలతో లంచ్
విజయవాడ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు బెజవాడ చేరుకున్నారు. ఆయనకు హెలిప్యాడ్ వద్ద మంత్రులు యనమల రామకృష్ణుడు, రావెల కిషోర్ బాబు, కామినేని శ్రీనివాస్ రావులు స్వాగతం పలికారు.
అనంతరం కెసిఆర్ చంద్రబాబు ఇంటికి వెళ్లారు. ఇంటి వద్ద ఏపీ సీఎం తెలంగాణ సీఎంను సాదరంగా ఆహ్వానించారు. పుష్పగుచ్ఛం ఇచ్చి కెసిఆర్ను చంద్రబాబు ఆహ్వానించారు. అనంతరం ఇంట్లో చండీయాగ ఆహ్వాన పత్రికను అందించారు. చంద్రబాబుకు కెసిఆర్ శాలువా కప్పి, జ్ఞాపికను అందించారు.

యాగంకు సంబంధించిన విషయాలను కెసిఆర్... బాబుతో చెప్పారు. ఆయన సాదరంగా విన్నారు. వారిద్దరు కాసేపు నవ్వుతూ మాట్లాడుకున్నారు. కెసిఆర్ అనుకున్న సమయానికి కంటే పావుగంట ఆలస్యంగా వచ్చారు. కెసిఆర్ వెంట మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీ బాల్క సుమన్ ఉన్నారు.
తెలంగాణ సీఎం కెసిఆర్ కోసం చంద్రబాబు పదిహేను రకాల వంటకాలు సిద్ధం చేయించారు. అందులో నాటుకోడి, చేపల పులుసు, గోంగూర, ముద్దపప్పు, కాకినాడ ఖాజా, ఉలవచారు, టమోటా పప్పు, మునక్కాయ సాంబారు, బిర్యానీ, గడ్డ పెరుగు, పూతరేకులు వంటి మిఠాయిలు, వివిధ రకాల పండ్ల ముక్కల్ని సిద్ధం చేశారు.
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా












Click it and Unblock the Notifications