రాజీనామా లేఖ మాకెందుకిస్తారు: తలసాని రాజీనామాపై కొత్త ట్విస్ట్
హైదరాబాద్: గత శాసన సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున సనత్ నగర్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా వివాదం పైన మరో ట్విస్ట్! ఆర్టీఐ చట్టం కింద తలసాని రాజీనామా చేయలేదని తేలినట్లు కాంగ్రెస్, టిడిపి నేతలు మండిపడుతున్న విషయం తెలిసిందే.
దీనిపై తెలంగాణ శాసన సభ అధికారులు వివరణ ఇచ్చారు. తలసాని రాజీనామా లేఖపై తాము సాంకేతికంగా సమాధానం పంపించామని, దీంట్లో కొత్తేమీ లేదని తెలంగాణ శాసనసభ అధికారులు చెబుతున్నారు. తలసాని రాజీనామాను తమకు ఇవ్వలేదని, స్పీకర్కు ఇచ్చి ఉండొచ్చని పేర్కొన్నారు.

కాంగ్రెస్ నేత గండ్ర వెంకట రమణా రెడ్డి సమాచార హక్కు చట్టం ద్వారా కోరిన దానిలో తెలంగాణ శాసనసభ సచివాలయానికి రాజీనామా లేఖ వచ్చిందా? అని మాత్రమే అడిగారని, దానికి తాము రాలేదని చెప్పామని అన్నారని తెలుస్తోంది.
ఎమ్మెల్యేలు తమ రాజీనామాలను సభాపతికి ఇస్తారని, వాటిని ఆమోదించిన తర్వాత నోటిఫికేషన్ జారీ చేయడం సహా మిగిలిన ప్రక్రియ కోసం శాసనసభ సచివాలయానికి లేఖ రాస్తారని, స్పీకర్కు లేఖ వచ్చిన వెంటనే నిర్ణయం తీసుకోకుండా శాసనసభ సచివాలయానికి పంపించే ఆనవాయితీ ఏమీ లేదంటున్నారని తెలుస్తోంది. రాజీనామా స్పీకర్ పరిధిలోని అంశమని చెబుతున్నారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications