షర్మిల నోరు అదుపులో పెట్టుకో.. బీజేపీయే తెలంగాణ ద్రోహీ : వినోద్ కుమార్
తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్న ద్రోహీ బీజేపీయేనని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కూమార్ విరుచుకుపడ్డారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలను తప్పుదోవపట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నలుగురు ఎంపీలు ఉండి రాష్ట్రానికి ఏం చేశారని విమర్శించారు. వారి వల్ల తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం లేదని దుయ్యబటారు . రాష్ట్రంలో కొత్తగా విద్యాసంస్థలను ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉన్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎలాంటి సహయం చేయడంలేదని మండిపడ్డారు.

విద్యాభివృద్ధికి మోదీ ప్రభుత్వం అడ్డుకట్ట
హైదరాబాద్లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ , ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ , నవోదయ విద్యాలయాలు, కరీంనగర్ లో ట్రిపుల్ ఐ.టీ ఏర్పాటు, వంటి పలు విద్యా సంస్థలను మంజూరు చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని వినోద్ కుమార్ ఆరోపించారు. తెలంగాణకు తీరని అన్యాయం చేస్తోందని దుయ్యబట్టారు. దీనిపై రాష్ట్ర బీజేపీ ఎంపీలు కనీసం నోరుమెదపడంలేదని విమర్శించారు. తెలంగాణలో విద్యాభివృద్ధికి మోదీ ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తోందని మండిపడ్డారు.

బీజేపీ ఎంపీలతో ఎలాంటి ప్రయోజనం లేదు..
తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నికైన నలుగురు బీజేపీ ఎంపీలు విద్యా సంస్థల మంజూరులో తమతో కలిసి రావడం లేదనన్నారు వినోద్ కుమార్. కనీసం బీజేపీ ఎంపీలు సొంతంగానైనా ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని విరుచుకుపడ్డారు. రాష్ట్రాభివృద్ధికి ఇకనైనా ఎంపీలు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లో జిల్లాకు ఒకటి చొప్పున నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాల్సి ఉంది.. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదన్నారు. కొత్తగా నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేస్తే గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు.

నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు
రైతులకు బీమా కల్పించడంలో కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. . 60 ఏండ్లు దాటిన వారు రైతు కాదా?..రైతు బీమా పరిమితిని 59 ఏండ్లుగా ఎలా నిర్ణయిస్తారు అని ప్రశ్నించారు. దీనిపై వినోద్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాదవద్దని ఆమెకు వార్నింగ్ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్రాల్లో అమలవుతున్న ఇన్సూరెన్స్, ఇతర పథకాల్లలో 60 ఏళ్లు లోపు ఉన్నవారికే వర్తిస్తున్నాయని పేర్కొన్నారు. షర్మిల ఇది మీకు తెలియదా? అని నిలదీశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుంది. వీటిని మెచ్చకోవాల్సింది పోయి .. విమర్శలు చేయడం సరికాదని వినోద్ కుమార్ హెచ్చరించారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications