డల్లాస్ లో శ్రీశ్రీ జయంతి
తెలుగు కవిత్వాన్ని ప్రజాస్వామీకరించిన శ్రీశ్రీ, వ్యవస్థను సామాజిక-ఆర్ధిక-రాజకీయ కోణంలో విశ్లేషించాడు. మరో ప్రపంచాన్ని నిర్వచించి ఒక సామాజిక పునాది వేసాడు. ఫూడల్ భావజాలంతో భ్రష్టుపట్టిన సాహిత్యరంగం బూజు దులిపాడు. సామాజిక వాస్తవాలు–జనజీవితాలు-మానవీయ విలువలతో నూతన సాహిత్యరంగ భూమిక నిర్మాణాన్ని మొదలు పెట్టాడు. భ్రస్టుపట్టిన సమాజాన్ని మార్చటం ఎలా? కుళ్ళి పోయిన యీ వ్యవస్థ లో సామాన్యుడికి న్యాయం జరుగుతుందాని శ్రీశ్రీ అన్వేషించాడు. చివరికి సమాజాన్ని మార్చటానికి రాజకీయ ప్రత్యామ్నాయలను సూచించాడు. నాటి మరో ప్రపంచం నుండి నేటి నూతన ప్రజాస్వామిక సమాజం కోసం ఎన్నో ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయి. శ్రీశ్రీ రచనలు అధ్యయనం చేసి, నేటి సమాజానికి అన్వయించుకోవలసిన అవసరం మున్నది.
తన కలం, గళం యీ సమాజాన్ని మార్చడానికి అంకితం చేసిన చెరబండరాజు, చివరి ఊపిరి వరకు పోరాడాడు. దిగంబర కవిత్వ ఉద్యమంలో ప్రస్థానం మొదలు పెట్టిన చెరబండరాజు, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను నిలదీసి ప్రశ్నిస్తూ కవిత్వం రాసాడు. విప్లవకవి గా ప్రజా పోరాటాల పాటయ్యాడు. ప్రజల పక్షం వహించినందుకు, తన పాటలతో వేలాది మందిని చైతన్యపరుస్తున్నందుకు, ప్రభుత్వాల నిర్భందం ఎదుర్కొన్నాడు సహజమైన శైలిలో సూటిగా, జనం గొంతుతో పాట కట్టాడు.
'బందిఖానాలల్ల
బంధించినారమ్మ
ప్రజల
బాగు
కొరకు
పాట
గట్టాడమ్మ
ఎరుపు
మామయ్యతో
గొంతు
కలిపాడమ్మ
నిర్దోషి
మీ
నాన్న
ఖైదీ
అయినాడమ్మ'
శ్రీశ్రీ-చెరబండ రాజు సాహిత్యాన్ని అధ్యయనం చేసి వాళ్ళ ఆశయాలను కొనసాగిద్దాం, వాళ్ళ లక్ష్యాలను నెరవేర్చుదాం. సమాజం మార్చటానికి కృషి చేద్దాం. ప్రజాస్వామిక హక్కులు, మానవీయ విలువలతో ఒక నూతన ప్రజాస్వామిక వ్యవస్థను నిర్మిద్దాం. శ్రీశ్రీ- చెరబండరాజు సభకు విజయవంతం చేయడానికి మీ సహాయ సహకారాలను అందించండి. పూర్తి వివరాలకు: http://prajakala.org/PDF/srisri.pdf