వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ఎంబియేపై అనుమానాలు?: దిన పత్రిక కథనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

ys jagan
2009 ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్లో తాను బి.కాం చదివినట్లు తెలిపిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి, పారిశ్రామికవేత్తగా మాత్రం ఎంబియే చదివినట్లు చూపారని ఆంధ్రజ్యోతి పత్రిక కథనం ప్రచురించింది. జగన్ ప్రత్యేకత, సమర్థత, అనుభవాన్ని మెచ్చి సండూర్ పవర్ కంపెనీ ఆయనకు నెలకు రూ.10లక్షల జీతం నిర్ణయించింది. లాభనష్టాలతో నిమిత్తం లేకుండా తమ మేనేజింగ్ డైరెక్టర్ జగన్‌కు కనీస వేతనంగా రూ.10 లక్షలు చెల్లించాలంటూ 2006 ఫిబ్రవరి 20వ తేదీన తీర్మానించింది. అది జగన్ సొంత కంపెనీ కాబట్టి ఎంత జీతమైనా తీసుకోవచ్చు. కానీ నిబంధనల ప్రకారం జీతం ఒక పరిమితికి మించితే మాత్రం కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. జగన్‌కు పది లక్షల జీతం చెల్లించేందుకు అనుమతించాలంటూ సండూర్ పవర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరీశ్ సి.కామర్తి కేంద్రానికి లేఖ రాశారు.

అంత జీతం ఎందుకు ఇవ్వాలంటే? అంటూ జగన్ గుణగణాల గురించి ఆయన లేఖలో వివరించారు. జగన్ మోహన్ రెడ్డి యువకుడు, ఉత్సాహవంతుడైన ఎంబీఏ గ్రాడ్యుయేట్ అని చెప్పారట. అదే జగన్ 2009 ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్‌లో జగన్ తాను బి.కామ్ చదివినట్లు చెప్పుకొన్నారు. ఈ ఏడాదిలోనే జరిగిన కడప ఉప ఎన్నికల సమయంలోనూ తన అత్యున్నత విద్యార్హత గా బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ అని మాత్రమే చెప్పారు. నిజంగా ఎంబీఏ చదివి ఉంటే ఎన్నికల అఫిడవిట్‌లో ఎందుకు దాచాల్సి వచ్చిందని ప్రశ్నించింది. జగన్ సామర్థ్యాల విషయానికి వస్తే ఈ జాబితాలో మొట్టమొదట జగన్‌కు ఆర్థిక, సాధారణ పరిపాలన రంగంలో విశేష అనుభవం ఉంది అని లేఖలో పేర్కొన్నారట. పరిపాలన సంగతి పక్కన పెడితే ఆర్థిక రంగంలో ఆయన నైపుణ్యం అపారమని ఇప్పటికే తేలిపోయిందని, నడవలేని స్థితిలో ఉన్న సండూర్ పవర్‌ను తన తండ్రి పవర్‌లోకి రాగానే కోట్ల లాభాల్లోకి తేవడం, ఆ కంపెనీల్లోకి ఎన్నెన్నో కోట్ల పెట్టుబడులు ప్రవహింప చేయడమే ఇందుకు నిదర్శనమని పేర్కొంది.

సండూర్ కంపెనీ రూపొందించిన జగన్ సామర్థ్యాల జాబితాలో ప్రాజెక్టులకు రుణాలు సంపాదించడంలో, నిధులను, వనరులను అతితక్కువ వడ్డీకి సేకరించడంలో జగన్‌కు ప్రత్యేక పరిజ్ఞానం ఉందని పేర్కొందట. జగన్‌కు ప్రభుత్వ సంస్థలతో మంచి సంబంధాలు ఉన్నాయని, ప్రాజెక్టులకు అవసరమైన చట్టబద్ధ అనుమతులు, లైసెన్సులు సంపాదించగలరని అందులో వివరించారట. అంటే పరోక్షంగా సిఎం కుమారుడిగా ఉన్నందువల్లే ప్రభుత్వం సంస్థలతో మంచి సంబంధాలు అనే పాయింట్ వచ్చిందని కథనంలో పేర్కొంది. తన సొంత కంపెనీలకు అనుమతులు, లైసెన్సులు సంపాదించి పెట్టేందుకు, తక్కువ వడ్డీకే రుణాలు తెచ్చేందుకు ముఖ్యమంత్రి కుమారుడిగా జగన్ తన హోదాను ఉపయోగించే వారని సండూర్ పవర్ కంపెనీ చెప్పకనే చెప్పిందన్నారు. మౌలిక సదుపాయాలు, గనులు, విద్యుత్ రంగంలో ప్రవేశించి అనేక విజయాలు సాధించినట్లు కూడా సండూర్ తన లేఖలో పేర్కొంది.

English summary
YSR Congress Party president YS Jaganmohan Reddy show his education qualification as degree in election affidavit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X