77 లక్షలు.. లడ్డూ రికార్డ్: దామోదర భార్య పద్మిని సొంతం
మెదక్: తెలంగాణలోని మెదక్ జిల్లా సంగారెడ్డి శివారులోని వైకుంఠపురంలో స్వామివారికి నైవేద్యంగా పెట్టిన 21 కిలోల లడ్డూకు బుధవారం వేలం పాట నిర్వహించగా రూ.77,77,777 పలికింది. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సతీమణి పద్మిని దీనిని సొంతం చేసుకున్నారు.
ధనుర్మాస పూజల్లో భాగంగా బుధవారం ఆలయంలో గోదారంగనాథ కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి మాజీ డిప్యూటీ సీఎం సతీమణి పద్మినితో పాటు శ్రీ వైకుఠపురం వలంటీర్లు, 350 మందికి పైగా దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
కల్యాణంలో గోదారంగనాథునికి ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. స్వామి వారికి నైవేద్యంగా పెట్టిన 21 కిలోల లడ్డూకు వేలం పాట నిర్వహించారు. పద్మిని రూ.77,77,777లకు పాడి సొంతం చేసుకున్నారు. గత ఏడాది రూ.7,77,777లకు లడ్డూ సొంతం చేసుకున్నారు.

ఈ సందర్భంగా పద్మిని మాట్లాడుతూ... గోదారంగనాథ కల్యాణ మహోత్సవంలో ఏటా లడ్డూను దక్కించుకోవడం పూర్వజన్మ సుకృతమన్నారు. రూ.77 లక్షలకు పైగా పోవడం ద్వారా ఈ లడ్డూ ధర వేలం పాటలో నిర్వాహకుల అంచనాలను మించిపోయింది. అత్యధిక ధర పలికి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.
గతేడాది వేలంలో లభించిన అత్యధిక ధర రూ.7 లక్షలు ఉండగా... ఈసారి కొంతమేర పెరగొచ్చని భావించారు. అయితే, నిర్వాహకుల అంచనాలకు అందనంతగా వేలం ప్రారంభంలోనే సంగారెడ్డికి చెందిన ఓ వైద్యుడు రూ.24 లక్షలు పాడారు. ఆ తర్వాత వేలం పాట పోటాపోటీగా సాగింది.
పోటీదారులు ఒకరికి మించి మరొకరు ధరను పెంచుకుంటూ పోయారు. చివరకు రూ.77,77,777లకు పద్మిణి వేలం పాడి ఈ లడ్డూను సొంతం చేసుకున్నారు. తిరుపతి వెంకటేశ్వరస్వామి దేవాలయంలా వైకుంఠపురానికి పేరు రావాలన్నది తన అభిలాషగా పద్మిని వెల్లడించారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications