'జగన్'ను చిదంబరం అందుకే లాగారా?

తెలంగాణకు ఎవరు అనుకూలంగా ఉన్నారు, ఎవరు లేరు, ఎవరు తమ అభిప్రాయం చెప్పలేదని చెబుతూ అభిప్రాయం చెప్పని పార్టీలలో వైయస్ జగన్ పార్టీ పేరు ప్రస్తావించారు. ఇదో హాట్ టాపిక్ అయి కూర్చుంది. చిదంబరం జగన్ పార్టీని ఎందుకు ప్రస్తావించాడనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. నిన్న మొన్నటి వరకు కాంగ్రెసు పార్టీలో ఉండి ఇప్పుడు సొంత కుంపటి పెట్టుకున్న వైయస్ జగన్ రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీని ముప్పుతిప్పలు పెడుతున్నారు. కాంగ్రెసుతో పాటు ప్రజారాజ్యం, తెలుగుదేశం పార్టీల నుండి ఆయన పార్టీలోకి వలసలు భారీగా ఉన్న నేపథ్యంలో జగన్ పార్టీని ఇరుకున పెట్టే వ్యూహంలో భాగంగానే కాంగ్రెసు అధిష్టానం జగన్ పార్టీ పేరును చిదంబరం నోటి నుండి వచ్చేట్లుగా చేసిందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది.
కాంగ్రెసుకు జగన్ను ఇరుకున పెట్టాలనే వ్యూహమే లేకుంటే జగన్ పార్టీ కన్నా ఎన్నో ఏళ్ల ముందు గుర్తింపు పొందిన లోక్ సత్తా పార్టీ పేరును ఎందుకు ప్రస్తావించలేదనేది కొందరి ప్రశ్న. ఇప్పుడే కాకుండా గతంలోనూ లోక్ సత్తా పేరును చిదంబరం ప్రస్తావించలేదని వారు ప్రశ్నిస్తున్నారు. గతంలోని అఖిలపక్షానికి టిడిపి, బిజెపి, కాంగ్రెసు వంటి అన్ని పార్టీలను పిలిచినప్పటికీ లోక్ సత్తాను ఎందుకు పిలవలేని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా చిదంబరం ఏర్పాటు చేసిన అఖిలపక్షం సమయానికి జగన్ పార్టీ ఇంకా పురుడు పోసుకోలేది. ఆ పార్టీ ఏర్పడి కనీసం ఆరు నెలలు కూడా కాలేదు. అలాంటి పార్టీ తన వైఖరి చెప్పలేదని చిదంబరం పార్లమెంటు వేదికగా ఎలా చెబుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు. జగన్ను తెలంగాణ చిక్కులో ఇరికించి రాజకీయంగా దెబ్బకొట్టాలనే అలాంటి వ్యాఖ్యలు చేశారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications