వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్: ఎంపీ ఆవేదన, ఆట మొదలైందని రేవంత్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కర్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రమాణ స్వీకారానికి సంబంధించి అప్పుడే వివాదం ప్రారంభమైంది. తెలంగాణ తొలి సిఎంగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి ప్రోటోకాల్ పాటించలేదని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు.

రాజ్యసభలో తెలంగాణకు కేటాయించిన ఏడుగురిలో తాను సభ్యుడిని అయినప్పటికీ తనకు ఆహ్వానం అందక పోవడం బాధ కలిగించిందని చెప్పారు. ప్రోటోకాల్ పాటించేలేదని చెబుతూ రాపోలు ఆనంద భాస్కర్.. సోమవారం గవర్నర్ నరసింహన్‌కు లేఖ రాశారు.

Rapolu complains to governor over not being invited for KCR oath fete

రాష్ట్రం ఏర్పడే సమయంలో పార్లమెంటు సభ్యులుగా తమ వంతు పాత్ర కూడా కొంత ఉందనే విషయాన్ని పట్టించుకోకుంటే ఎలా అని ఆయన అన్నారు. అరవయ్యేళ్ల తెలంగాణ కల సాకారమైన సమయంలో ఎంపీలను ఆహ్వానించక పోవడం దారుణమని వ్యాఖ్యానించారు.

మరోవైపు శాసన సభలో ముఖ్యమంత్రిని నిలదీస్తామని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి సోమవారం విలేకరుల సమావేశంలో అన్నారు.

నిన్నటి వరకు సంధికాలమని, ఈ రోజు నుంచి ఆట మొదలైందని, ఈ ఆటలో కెసిఆర్‌కు ప్రజలు అధికారం కట్టబెట్టారు తప్ప యాజమాన్య హక్కులు కాదని రేవంత్ అన్నారు. కెసిఆర్ ఇచ్చిన హామీలను అమలయ్యేలా చూడాలన్నారు. హామీలు అమలు చేయకపోతే శాసనసభలో ఆయన సంగతి తేలుస్తామన్నారు. ప్రజల హక్కులకు కాపలాదారులుగా తాముంటామని, ప్రజల పక్షాన పోరాడుతామని చెప్పారు.

English summary
Congress MP Rapolu Anand Bhaskar complains to governor not being invited for KCR oath fete.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X