కెసిఆర్: ఎంపీ ఆవేదన, ఆట మొదలైందని రేవంత్
హైదరాబాద్: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కర్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రమాణ స్వీకారానికి సంబంధించి అప్పుడే వివాదం ప్రారంభమైంది. తెలంగాణ తొలి సిఎంగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి ప్రోటోకాల్ పాటించలేదని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు.
రాజ్యసభలో తెలంగాణకు కేటాయించిన ఏడుగురిలో తాను సభ్యుడిని అయినప్పటికీ తనకు ఆహ్వానం అందక పోవడం బాధ కలిగించిందని చెప్పారు. ప్రోటోకాల్ పాటించేలేదని చెబుతూ రాపోలు ఆనంద భాస్కర్.. సోమవారం గవర్నర్ నరసింహన్కు లేఖ రాశారు.

రాష్ట్రం ఏర్పడే సమయంలో పార్లమెంటు సభ్యులుగా తమ వంతు పాత్ర కూడా కొంత ఉందనే విషయాన్ని పట్టించుకోకుంటే ఎలా అని ఆయన అన్నారు. అరవయ్యేళ్ల తెలంగాణ కల సాకారమైన సమయంలో ఎంపీలను ఆహ్వానించక పోవడం దారుణమని వ్యాఖ్యానించారు.
మరోవైపు శాసన సభలో ముఖ్యమంత్రిని నిలదీస్తామని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి సోమవారం విలేకరుల సమావేశంలో అన్నారు.
నిన్నటి వరకు సంధికాలమని, ఈ రోజు నుంచి ఆట మొదలైందని, ఈ ఆటలో కెసిఆర్కు ప్రజలు అధికారం కట్టబెట్టారు తప్ప యాజమాన్య హక్కులు కాదని రేవంత్ అన్నారు. కెసిఆర్ ఇచ్చిన హామీలను అమలయ్యేలా చూడాలన్నారు. హామీలు అమలు చేయకపోతే శాసనసభలో ఆయన సంగతి తేలుస్తామన్నారు. ప్రజల హక్కులకు కాపలాదారులుగా తాముంటామని, ప్రజల పక్షాన పోరాడుతామని చెప్పారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్..












Click it and Unblock the Notifications