నిలదీస్తునే ఉంటా: పవన్

అది అందుకున్న పవన్...నాకు వ్యక్తిగతంగా ఏ తెలుగుదేశం నాయకుడిపైనా, కాంగ్రెస్ నాయకుడిపైనా కోపం లేదు. మీరు తప్పులు చేస్తూనే ఉంటూ.. మమ్మల్ని వేలెత్తి చూపొద్దంటే ఊరుకునేది లేదు. తప్పులను వేలెత్తి చూపి ఎలుగెత్తి చాటకపోతే మేమొచ్చి ప్రయోజనమేంటి? ఇంతమంది జనాన్ని మోసం చేసినట్టు కాదా' అంటూ ప్రశ్నించారు.
'వీళ్లంతా జనాన్ని నమ్మించి ఓట్లేయించుకున్నారు. దశాబ్దాల తరబడి అధికారం వెలగబెడుతునే ఉన్నారు. కోట్లు కొల్లగొట్టిన నాయకులంతా ప్రజలకిచ్చిన వాగ్దానాలను మాత్రం అటకెక్కించారు. జనానికిచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకూ నేను ప్రశ్నిస్తూనే ఉంటా. నిలదీస్తునే ఉంటా' అంటూ పవన్కళ్యాణ్ పేర్కొన్నారు.''కాంగ్రెస్ నాయకులంటే నాకు ఎప్పుడూ అభిమానమే. వాళ్లిచ్చిన 'ఇందిరమ్మ' ఇళ్లు రెండున్నరేళ్లకే కూలిపోతున్నాయి. అభివృద్ధి అంటే ఇదా. ఈ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి దీర్ఘకాలికంగా ప్రజలకు ఉపయోగపడుతోందా'' అంటూ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications