కొండా సురేఖ సొంత జిల్లాకు రాక
దాదాపు 500 వాహనాలతో ర్యాలీగా తరలివస్తారు. జనగాం, స్టేషన్ ఘన్పూర్, మడికొండ తదితర ప్రాంతాల్లో సురేఖ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతారు. మడికొండలో కార్పొరేటర్ మర్రి జనార్దన్ పటేల్ స్వాగ తం పలుకుతారు. అక్కడి నుంచి సుబేదారిలోని డాక్టర్ వైయస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి కొండా దంపతులు పూలమాలలు వేసి నివా ళులర్పించిన అనంతరం ప్రసంగిస్తారు. ఆ తర్వాత కొండా దంపతులు వంచన గిరికి బయలుదేరి వెళతారు. రాజీనామాకు దారి తీసిన కారణాలు, భవిష్యత్తు కార్యచరణను సురేఖ వెల్లడించనున్నట్లు కొండా వర్గీయులు భావిస్తున్నారు.
Comments
Story first published: Tuesday, November 10, 2009, 13:50 [IST]