15 రోజులు సెలవులు: ఆగని ఆందోళనలు

సెలవులు ప్రకటించినప్పటికీ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల్లోనే కాకుండా ఇతర విశ్వవిద్యాలయాల్లో కూడా రిలే నిరాహార దీక్షలు సాగిస్తున్నారు. విద్యార్థి సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (జెఎసి) ప్రతినిధులు వివిధ రాజకీయ పార్టీల నాయకులను కలుస్తూ తెలంగాణకు మద్దతివ్వాలని కోరుతున్నారు. వరంగల్ లో విద్యార్థులు మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంటిని ముట్టడించారు. నల్లగొండలో మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఇంటి వద్ద విద్యార్థులు ధర్నా చేశారు.












Click it and Unblock the Notifications