వంట గ్యాస్ సబ్సిడీపై చేతులెత్తేసిన రోశయ్య ప్రభుత్వం
కాగా, ఫీజుల రీయంబర్స్ మెంటు, బోధనా ఫీజుల చెల్లింపునకు మంత్రి వర్గ సంఘం చేసిన సిఫార్సులపై మంత్రివర్గంలో ఏకాభిప్రాయం కుదరలేదు. లక్ష రూపాయల ఆదాయ పరిమితి విధించి ఫీజుల రియంబర్స్ మెంట్ ఇవ్వాలనే మంత్రుల సంఘం చేసిన సిఫార్సుపై భిన్నాభిప్రాయం వ్యక్తం కావడంతో దానిపై నిర్ణయాన్ని మంత్రివర్గం వాయిదా వేసింది. కాగా, మెడికల్, డెంటల్, ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజుల పెంపుపై మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇదిలా వుంటే, ఐటి పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ విధానం కింద ఐటి ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఐటి పార్కులు ఏర్పాటు చేసే సంస్థలకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం తలపెట్టింది. దీని వల్ల లక్షా 50 వేల అదనపు ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించింది. ఉద్యోగుల డిఎను 6.84 శాతం పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
ఆల్మట్టి ఎత్తుపై కృష్ణా ట్రిబ్యునల్ ముందు రాష్ట్ర ప్రభుత్వ వాదనలపై ముఖ్యమంత్రి కె. రోశయ్య అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. సమర్థులైన న్యాయవాదులను ఏర్పాటు చేసి సుప్రీంకోర్టులో ఆల్మట్టిపై కర్నాటక ప్రభుత్వ వాదనలను తిప్పికొట్టాలని ఆయన భారీ నీటి పారుదల శాఖ మంత్రిని ఆదేశించారు.