పరీక్షలు వాయిదా పడటంతో రేపు బందు లేదు: కెసిఆర్

శాసనసభా పక్షనేత ఈటెల రాజేందర్ అన్నారు. ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేయటం హర్షణీయమన్నారు. ఇది విద్యార్థుల, తెలంగాణవాదుల విజయమని ఆయన అన్నారు. రాత పరీక్షలను రద్దు చేయటం పట్ల సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. పరీక్షల రద్దుకు విద్యార్థులు భారీ ఉద్యమాన్ని చేపట్టారన్నారు. అయితే ప్రభుత్వం వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవటంతో మాత్రమే ఆగితే సరిపోదన్నారు. ఫ్రీజోన్ విషయం యుద్ధప్రాతిపదికపైన తేల్చాలన్నారు.
ప్రభుత్వం తన వద్దనున్న ఫైలును కేంద్రానికి పంపించాలని డిమాండు చేశారు. ఢిల్లీలో ఫైలు కదలడానికి ఒక ఉన్నతస్థాయి ఐఏఎస్ అధికారిని నియమించి నిత్యం పర్యవేక్షణ జరిపించాలని అన్నారు. ఎస్ఐ పరీక్షలు రద్దు కొరకు తెలంగాణలోని పది జిల్లాల్లోని విశ్వవిద్యాలయాలు, ప్రజలు బాగా సహకరించారన్నారు. కాగా ప్రభుత్వం పరీక్షలు వాయిదా వేయటంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆనందాలు వెల్లునిరిశాయి. ప్రభుత్వం దిగిరావడం యావత్ తెలంగాణ విద్యార్థుల విజయంగా అభివర్ణించారు. ఇది విద్యార్థుల విజయమంటూ నినాదాలు చేశారు. ఆర్ట్సు కళాశాల నుండి తార్నాక వరకు భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications