పార్టీ ముందు పెనుసవాళ్లు: ప్లీనరీలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ
నవ్యత, సేవ ఈ రెండు కాంగ్రెస్ ఎజెండా అని ప్రకటించారు. కేంద్రంలో, కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదంటే ఆ ఘనత ఎవరి వ్యక్తిగతం కాదని, అది పార్టీ ఘనతే అన్నారు. జమ్ము-కాశ్మీర్ లో శాంతి భద్రతలకై కృషి చేస్తామని చెప్పారు. నక్సల్స్ సమస్యను అరికట్టడానికి సంపూర్ణంగా కృషి చేస్తామని చెప్పారు. దేశంలోని ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూస్తున్నారని చెప్పారు.
కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితుల్లో అనేక సవాళ్లను ఎదుర్కొంటుందన్నారు. ప్రతినేత ప్రస్తుతం ఆత్మపరిశీనల చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. జాతీయంగా పార్టీని ప్రక్షాళన చేయాలని బీహార్ ఎన్నికలు రుజువు చేశాయన్నారు. పార్టీ అధఇకారంలో లేని రాష్ట్రాల్లో కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. కాగా ఈ ప్లీనరీలో కాంగ్రెస్ అధ్యక్ష పదవిని మూడు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాలకు పొడిగిస్తూ పార్టీ నిబంధనను పొడిగించారు.