హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ శాఖపై వెనక్కి తగ్గిన తెలుగుదేశం తమ్ముళ్లు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telugudesam
హైదరాబాద్: గత కొంతకాలంగా తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం ప్రత్యేక శాఖకు పట్టుబడుతున్న తెలుగు తమ్ముళ్లు వెనక్కి తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. నాగం జనార్ధన్‌ రెడ్డి, కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకరరావు తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖకు పట్టుబడుతున్న విషయం తెలిసిందే. చంద్రబాబు మాత్రం ప్రత్యేకశాఖ కాకుండా సమన్వయ కమిటీ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో విభేదించిన నాగం, ఎర్రబెల్లి, కడియంలు తెలంగాణకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలతో నాగం ఇంటిలో రెండు రోజుల క్రితం భేటీ కావటం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగాయి.

నాగం ఇంటిలో భేటీ అయిన శాసనసభ్యులందరినీ చంద్రబాబు ఫోన్ చేసి పిలిచారు. కానీ నాగం, ఎర్రబెల్లి, కడియంలను మాత్రం పిలవలేదు. ఇలాంటి వారు పార్టీలో నుండి బయటకు వెళ్లినా ఫరవాలేదు అన్నట్టు చంద్రబాబు వ్యవహరించారు. అయితే తెలంగాణ టిడిపి నేతలు బాబుకు నచ్చజెప్పడంతో ఆయన కాస్త చల్లబడి వారిని పిలిపించి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రత్యేక శాఖ అవసరం లేదని, సమన్వయ కమిటీ ఏర్పాటు మాత్రం చేసుకోవచ్చని ఆయన సూచించారు. దానికి వారు ఒప్పుకోక పోవడంతో మూడురోజులు తనకు పర్యటన ఉందని, పర్యటన నుండి వచ్చిన అనంతరం మాట్లాడుదామని చెప్పి వెళ్లారు.

అయితే ఆ తర్వాత తెలంగాణ, సీమాంధ్ర ఎమ్మెల్యేలు అందరూ కలిసి రహస్యంగా చర్చించుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ శాఖ పేరుతో, రాజీనామాల బెదిరింపులతో బాబుకు కొత్తగా తలనొప్పులు తీసుకు రావద్దని సీమాంధ్ర నేతలు తెలంగాణ నేతలకు సూచించినట్టు తెలుస్తోంది. బాబు చెప్పిన కో ఆర్డినేషన్‌కే మొగ్గు చూపాలని వారు కోరినట్టు తెలుస్తోంది. వారు వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది. దీంతో చంద్రబాబు వచ్చాక జరిగే భేటీ హాట్‌హాట్‌గా కాకుండా కూల్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X