ప్రస్తుత పరిస్దితులలో కాంగ్రెసు ప్రక్షాళన జరిపితే మంచిది: ఎంపీ సబ్బం హరి

కానీ ప్రస్తుతం రాష్ట్రంలో భిన్న రాజకీయ వాతావరణం నెలకొందని, ఒక కాంగ్రెసు కార్యకర్తగా బాధపడే పరిస్థితులున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలతో పూర్తిగా మారిందన్నారు. ఎవరిది తప్పో తాను ప్రకటించనని, ఆ విషయం మాట్లాడితే తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడానని అంటారని చెప్పారు. ఏదైనా రాష్ట్రం సంక్షోభం దిశగా వెళ్లడానికి కాంగ్రెసు కొంత కారణమైందని అంగీకరించారు. ఈ పరిస్థితులను సరిచేసి, ప్రక్షాళన జరిపి మంచి వాతావరణాన్ని పార్టీ తీసుకురాగలిగితే కాంగ్రెసులో ఉండటానికి ఇష్టపడతానన్నారు. రాష్ట్ర ఎంపీలకు కేబినెట్లో సముచిత గౌరవం కల్పించడం అవసరమన్నారు.
ఇక పోతే రాష్ట్ర కేబినెట్లోకి పీఆర్పీని తీసుకుంటే తీవ్ర పరిణామాలుంటాయనేదే ఇప్పటికీ తన అభిప్రాయమని సబ్బం తెలి పారు. 155 మంది కాంగ్రెసు ఎమ్మెల్యేలు ఉన్నందున వారికే మంత్రివర్గంలో స్థానం కల్పించాలని, పీఆర్పీవారిని తీసుకోరాదని అభిప్రాయపడ్డారు. 2014వరకు ప్రభుత్వాన్ని అస్థిరపరిచేది లేదని అనేక సందర్భాల్లో యువనేత జగన్ చెబుతున్నారని, ఈ పరిస్థితుల్లో కాంగ్రెసువారిని ఉపయోగించుకుని పార్టీని బలోపేతం చేయాలని సూచించారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications