హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యువతను నిర్లక్ష్యం చేస్తే ఈజిప్టు తరహా ఉద్యమం: కొండా సురేఖ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Konda Surekha
హైదరాబాద్: ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తే ఈజిప్టు వచ్చిన ప్రజా ఉద్యమం ఇక్కడ వస్తుందని మాజీ మంత్రి, పరకాల ఎమ్మెల్యే కొండా సురేఖ శుక్రవారం మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద జరిగిన ఫీజుపోరులో హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఫీజుల కోసం నడి సముద్రంలో కొట్టుకుంటున్న సమయంలో జగన్ నేను మీకు అండగా ఉంటానని దీక్షకు పూనుకున్నారన్నారు. రాష్ట్ర ప్రజలకు వైఎస్‌పైన, వైఎస్ కుటుంబంపైన ఉన్న ప్రేమాభిమానాలను ఎవరూ తొలగించలేరన్నారు. రాజకీయాలు ఎప్పుడూ శాశ్వతం కాదన్నారు. మాట తప్పని వైఎస్ వారసుడిగా జగన్ కూడా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారన్నారు. ప్రజా ఉద్యమం ఈజిప్టులో ముప్పయ్యేళ్ల ముబారక్‌ను గద్దె దింపిందన్నారు.

ప్రభుత్వం ఈ రోజు యువతతో పెట్టుకుందని, ఏ దేశమైనా యువతతో పెట్టుకుంటే బ్రతికి బట్టకట్టదన్నారు. ప్రయివేటు కళాశాలలు ఎప్పుడైనా ఫీజు రీయింబర్స్‌మెంట్స్ ఇవ్వమని అడిగారా అని కాని ఇప్పుడు అడుగుతున్నారన్నారు. పేద విద్యార్థులకు కూడా మంచి విద్యను అందించడానికే వైఎస్ ఫీజు రీయింబర్స్‌మెంట్స్ ప్రవేశ పెట్టారన్నారు. వైఎస్ చనిపోయాక ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌ను ప్రభుత్వం ఇవ్వడం మానివేసిందన్నారు. ప్రభుత్వం చర్యల వల్ల 25 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో మునిగి పోయిందన్నారు. వైఎస్ పథకాలు కాంగ్రెస్ పథకాలు అని చెప్పుకోవడం కాదని వాటిని అమలు పర్చాలని డిమాండ్ చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్స్ చెల్లించకపోవడం వల్ల రైతు కుటుంబనుండి వచ్చిన విద్యార్థుల కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. ప్రభుత్వం ఆస్తులు అమ్మి అయినా ఫీజు రీయింబర్స్‌మెంట్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. యువత దేశానికి వెన్నుముక అని, వారిని విస్మరిస్తే ప్రభుత్వాలు మనుగడ సాధించలేవన్నారు. విద్యార్థులు కూడా ఉద్వేగానికి లోనై ఆత్మహత్యలకు పాల్పడకూడదని కోరారు. ఎవరూ మరో వరలక్ష్మిలా మారకూడదన్నారు. ఒక్కరోజు దీక్ష చేస్తే ప్రభుత్వం కళ్లు తెరవదని, వారం రోజుల దీక్షకు పూనుకున్నారన్నారు.

English summary
Egypt agitation will repeat here, if government neglects youth said Ex minister Konda Surekha in Fee poru at indira park, Hyderabad. She demanded government to release fee reimbursements as soon as possible.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X