అసెంబ్లీలో కాంగ్రెసు, టిఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్: పయ్యావుల కేశవ్

తెలుగుదేశం పార్టీకి చెందిన సీమాంధ్ర ఎమ్మెల్యేలు తెలంగాణ తీర్మానం ప్రవేశ పెడితే ఆయా పార్టీల ఎమ్మెల్యేల ఎటు మద్దతు ఇస్తారో బయట పడుతుందన్నారు. తెలంగాణకు చెందిన అన్ని పార్టీల శాసనసభ్యులు తెలంగాణకు అనుకూలంగా ఉన్నారన్నారు. సమావేశాలు సజావుగా సాగటం లేదని సిపిఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. సమావేశాలు మొక్కుబడిగా మాత్రమే సాగుతున్నాయన్నారు. సభ సజావుగా నడవక పోవడం వలన ప్రజాధనం వృథా చేస్తున్నారన్నారు. టిఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేస్తున్నట్టు తెలంగాణ సమస్యపై తీర్మానం ప్రవేశ పెడుతారా లేదా అని ప్రభుత్వం తేల్చుకోవాలన్నారు. తీర్మానం పెడితే పెడతానని చెప్పాలన్నారు. లేదంటే సభను అడ్డుకునే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications