ఎస్ బ్యాండ్ ఒప్పందంతో మాకు సంబంధం లేదు: ప్రధాని మన్మోహన్

ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత మెరుగుపరుస్తాం అన్నారు. ద్రవ్యోల్బణం తగ్గించడానికి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉల్లి, ఆయిల్ వంటి నిత్యావసర ధరలు బాగా పెరిగాయన్నారు. అంతర్జాతీయ విపణిలో ధరలు క్రమంగా పెరుగుతున్నయన్నారు. అందుకే వాటిపై మనకు నియంత్రణ లేకుండా ఉందన్నారు. గోదుమ, బియ్యం వంటి వాటి ధరలు నియంత్రించడానికి గోడౌన్లో భారీగా నిల్వలకు చర్యలు చేపట్టామని చెప్పారు. సిడబ్లూజీలో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. అవినీతికి పాల్పడిన వారిని కేంద్రం ఏమాత్రం ఉపేక్షించే ప్రశ్న లేదన్నారు.
గత కొన్నేళ్లలో టెలికాం రంగం గ్రామీణ ప్రాంతాల్లో 30 శాతం వృద్ధి చెందిందన్నారు. ఇప్పుడు పోన్ ఓ నిత్యావసరంలా తయారయిందన్నారు. పట్టణాల్లో కూడా బాగా పెరిగిందన్నారు. ఎన్డీయే ప్రభుత్వం హయాంలోనే లైసెన్సుల విధానంలో మార్పులు వచ్చాయన్నారు. 2జి లైసెన్సుల వేలం నిర్వహించాల్సి ఉండేదని, కానీ అలా జరగలేదన్నారు. ముందుగా వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత అన్న రీతిలో కొనసాగటం వల్లనే ఇలాంటి సమస్య వచ్చిందన్నారు. 2జి స్కాంపై జెపిసి వేశాం కాబట్టి అది విచారణ జరుపుతుందన్నారు. అయితే అవినీతికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దేశాభివృద్ధిలో ప్రజలకు భాగస్వామ్యం ఉండాలని అన్నారు. ఎస్ బ్యాండ్ - దేవాస్ ఒప్పందంలో పిఎంఓకు ఎలాంటి సంబంధం లేదన్నారు. దీనిపై ఉన్నతస్థాయి కమిటీ వేసినట్లు ఆయన తెలిపారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications