సీమాంధ్ర నాయకులు వెకిలి మాటలు మాట్లాడుతున్నారు: కెసిఆర్

కాంగ్రెసు పార్టీకి విలీనం పిచ్చి పట్టుకుందని ఆయన విమర్శించారు. తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెసు పార్టీని ప్రజలే బంగాళాఖాతంలో కలిపేస్తారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు ఐక్యంగా ఉండాలని, ఐకమత్యంతోనే తెలంగాణ సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే హైదరాబాదులో మూతపడిన 400 కల్లు దుకాణాలను తెరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ కల్లుగీత కార్మికులను దెబ్బ తీస్తూ ప్రభుత్వం హైదరాబాదు కల్లు దుకాణాలను మూసేసిందని ఆయన విమర్శించింది. కాంగ్రెసులో తెరాస విలీనం జరిగే ప్రసక్తి లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications