వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోర్టులో కనిమొళిని చూసి కంటతడి పెట్టుకున్న ఆమె తల్లి

|
Google Oneindia TeluguNews

Kanimozhi
మాజీ టెలికాం మంత్రి ఏ రాజా మరియు డిఎంకె పార్లమెంటు సభ్యురాలు కనిమొళి ఇద్దరూ 2జీ స్పెక్ట్రమ్ కేసు విచారణలో భాగంగా శనివారం ఉదయం న్యూఢిల్లీలోని ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. వీరితో పాటు కలైంగర్ టివి ఎండి శరత్ కుమార్‌‌ను ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు.కనిమొళి తల్లి రజాతి అమ్మల్ మరియు డిఎంకె నేత టి ఆర్ బాలు కూడా కోర్టు ముందు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కోర్టులో కనిమొళిని చూసి రజాతి అమ్మల్ కన్నీరు పెట్టుకున్నారు. 2జీ కుంభకోణం కేసులో డిఎంకె అధినేత కరుణానిధి కుమార్తెకు సంబంధం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం కనిమొళిని అరెస్టు చేయాల్సిందిగా కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. పాటియాలా హౌజ్ ప్రాంగణంలోని ప్రత్యేక కోర్టులో వీరిద్దరినీ హాజరు పరిచారు.

కోర్టులో సిబిఐ (సెంట్రల్ బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్) ప్రత్యేక న్యాయవాది ఓ.పి. సోనీ మాట్లాడుతూ.. ఈ కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకొని, నిందితులు బెయిల్‌పై విడుదలైతే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున, వారికి బెయిల్ నిరాకరించడమైనదని అన్నారు.

English summary
In connection to 2G spectrum scam former telecom minister A Raja and DMK MP Kanimozhi, daughter of DMK head Karunanidhi were on Saturday produced before a special court in New Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X