బెజవాడ వివాదంతోనే సూరిని హత్య చేసిన భాను కిరణ్: చార్జిషీట్

కాగా ఎనిమిది నెలల క్రితం విజయవాడలోని అన్నపూర్ణ ప్యాకేజి ఇండస్ట్రీస్ను యజమాని పెద్ద కుమారుడు శ్యాంప్రసాద్ను బెదిరింపులకు గురి చేసి చిన్న కుమారుడు అయిన కృష్ణప్రసాద్కు రాయించి ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. అన్నపూర్ణ విలువ సుమారు 2 కోట్ల నుండి మూడు కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని అంచనా. అన్నపూర్ణ గొడవలో తన మధ్యవర్తిత్వాన్ని సూరి కూడా ఖండించారు. అయితే ఇప్పుడు సిసిఎస్ పోలీసులు చార్జీషీటులో అన్నపూర్ణ విభేదాలే హత్యకు కారణమయ్యాయని పేర్కొనడం విశేషం. అంతేకాదు ఈ అన్నపూర్ణ ప్యాకేజి గొడవలో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడిపై కూడా ఆరోపణలు వచ్చాయి.












Click it and Unblock the Notifications