వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మందుపాతర పేల్చిన నక్సలైట్లు, చత్తీస్‌గడ్‌లో పది మంది జవాన్ల మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Naxal Attack
రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో మరోసారి మావోయిస్టులు రెచ్చిపోయారు. దంతెవాడ జిల్లాలోని కటికల్యాన్‌ సమీపంలోని ఓ వంతెన వద్దకు జవాన్లతో కూడిన వాహనం రాగానే మావోయిస్టులు గురువారం అర్థరాత్రి మందుపాతర పేల్చారు. దీంతోపాటు జవాన్లపైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఏడుగురు స్పెషల్‌ పోలీసు ఆఫీసర్లు(ఎస్‌పీఓ), ముగ్గురు జవాన్లు మరణించినట్లు పోలీసులు తెలిపారు. గాయాలపాలైన ముగ్గురిని బస్తర్‌ జిల్లాలోని ఆస్పత్రికి తరలించారు.

సంఘటన జరిగిన స్థలం రాయపూర్‌కు 400 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దాడిలో పాల్గొన్న మావోయిస్టుల్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. గాలింపు చర్యల కోసం రెండు వాహనాల్లో పోలీసులు వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది. మృతుల్లో ఏడుగురు స్పెషల్ పోలీసు ఆఫీసర్లు, ముగ్గురు రాష్ట్ర పోలీసు అధికారులు ఉన్నారు. బస్తర్ ప్రాంతంలో ఇటీవల మావోయిస్టులు ఐదుగురు పోలీసులను కాల్చి చంపారు.

English summary
Ten securitymen were killed in a powerful landmine blast triggered by Maoists around midnight Thursday in Chhattisgarh's restive Bastar region, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X