వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కుమారుల అత్యాశే యడ్యూరప్ప కొంప ముంచింది
లోకాయుక్త నివేదిక ప్రకారం - బెంగుళూర్లోని అత్యంత విలువైన 1.20 ఎకరాల భూమిని డీనోటిఫై చేయాలని ఇద్దరు కుమారులు యడ్యూరప్పపై ఒత్తిడి తెచ్చారు. అసలు యజమానులకు అప్పగించడానికి ప్రభుత్వం 2004లో 17 లక్షలకు ఆ భూమిని స్వాధీనం చేసుకుంది. ఆ భూమిని యడ్యూరప్ప కుమారులు 20 లక్షల రూపాయలకే తీసుకున్నారు. దాని మార్కెట్ విలువ 1.34 కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ భూ లావాదేవీయే యడ్యూరప్ప గద్దె దిగడంలో ప్రధాన పాత్ర పోషించింది. మరి కొన్ని డీనోటిఫికేషన్ వ్యవహారాల్లో కూడా యడ్యూరప్ప కుమారుల పేర్లు వినిపిస్తున్నాయి. వాటికి సంబంధిచిన కేసులు అవినీతి నిరోధక కోర్టుల ముందు పెండింగులో ఉన్నాయి. మరో ప్రధాన ఆరోపణ - యడ్యూరప్ప సొంత పట్టణం షిమోగాలోని ప్రేరణ ఎడ్యుకేషన్ ట్రస్టు 2010లో సౌత్ వెస్ట్ మైనింగ్ కంపెనీ నుంచి 20 కోట్ల రూపాయల లంచం తీసుకుంది.
Comments
English summary
Ambitious sons brought BS Yeddyurappa to grief, his 38-month tenure ending on Sunday in ignominy, after their dubious land deals were exposed by Lokayukta Justice Santosh N Hegde.
Story first published: Monday, August 1, 2011, 11:04 [IST]