వైయస్సార్ విగ్రహంపై తెలంగాణవాదుల దాడి

కాగా సకల జనుల సమ్మెతో కేంద్ర ప్రభుత్వం దిగి రాక తప్పదని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరాం హైదరాబాదులో అన్నారు. తెలంగాణ ఏర్పడే వరకు ఉద్యమం కొనసాగుతుందని చెప్పారు. విద్యార్థులకు తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురైనప్పటికీ ముందు ముందు వాటిని పూడుస్తామని చెప్పారు. విధిలేకనే సమ్మెకు పిలుపునిచ్చినట్లు చెప్పారు. తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మాలని కోరారు. శాంతియుతంగా పోరాటం చేద్దామని కోరారు. నల్లగొండ జిల్లా కోదాడలోని తెలుగుదేశం పార్టీ నాయకుడు చందర్ రావు ఇంటిని తెలంగాణవాదులు ముట్టడించారు. రాజీనామా చేయాలని తెలంగాణవాదులు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications