వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరోసారి మంత్రి వట్టి వసంతకుమార్ అసంతృప్తి

By Pratap
|
Google Oneindia TeluguNews

Vatti Vasanthakumar
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ తీరుపై మంత్రి వట్టి వసంతకుమార్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన సర్గుకుపోవడానికి నిర్ణియించుకున్నారు. మరో రెండు రోజుల్లో నవంబర్ 2వ తేదీన రచ్చబండ కార్యక్రమం ప్రారంభం కాబోతున్న తరుణంలో ఆయన అసంతృప్తి బయటపడింది. ముఖ్యమంత్రి సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వట్టి వసంత కుమార్ గత రచ్చబండ కార్యక్రమంపై ప్రశ్నలు లేవనెత్తారు. ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో పలు అంశాలపై వేడివేడి చర్చ జరిగింది. గత రచ్చబండ కార్యక్రమం బిల్లులే క్లియర్ కాలేదని వట్టి వసంత కుమార్ అన్నారు.

పింఛన్లనలో అవకతవకలు జరిగాయని, పాత బిల్లులు క్లియర్ కాలేదని ఆయన అన్నారు. వట్టి వసంతకుమార్‌కు సర్గిచెప్పడానికి ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. రచ్చబండలో వచ్చిన దరఖాస్తులకు పరిష్కారాలకు పొంతన లేదని మరో మంత్రి ధర్మాన ప్రసాద రావు అన్నారు. పోలవరం ప్రాజెక్టును తెలంగాణవాదులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని వట్టి వసంతకుమార్ అన్నారు. తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పోలవరం ప్రాజెక్టు విషయంసో కుమ్మక్కయ్యాయని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అందరూ సహకరించాలని ఆయన కోరారు.

విద్యార్థులు ఫీజులు, ట్యూషన్ ఫీజులు, ఫీజు రీయంబర్స్‌మెంట్ కోసం రేపటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చునని మంత్రి పితాని సత్యనారాయణ చెప్పారు. విద్యార్థులే దరఖాస్తు చేసుకోవాలని, విద్యా సంస్థలు దరఖాస్తు చేయకూడదని ఆయన అన్నారు.

English summary
Minister Vatti Vasantahkumar expressed his dissatisfaction over Rachabanda
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X