మరో నలుగురు ఎమ్మెల్యేల రాజీనామాల ఆమోదం

కాగా, మూకుమ్మడిగా రాజీనామాలు చేసిన తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుల రాజీనామాలను, తెరాస శాసనసభ్యుల రాజీనామాలను ఆయన తిరస్కరించారు. మొత్తం 61 మంది రాజీనామాలను ఆయన ఆమోదించలేదు. తెలంగాణ కోసం వీరు రాజీనామాలు చేశారు. భావోద్వేగాలకు గురై రాజీనామాలు చేశారనే ఉద్దేశంతో ఆ రాజీనామాలను ఆయన తిరస్కరించినట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కొండా సురేఖలపై, తెలుగుదేశం పార్టీకి చెందిన బాలనాగిరెడ్డి, ప్రజారాజ్యం పార్టీకి చెందిన శోభా నాగిరెడ్డిలపై అనర్హత పిటిషన్లు పెండింగులో ఉన్నాయి. వాటిపై వాదనలు పూర్తి కాలేదు. వాటిపై స్పీకర్ ఏ విధమైన నిర్ణయమూ తీసుకోలేదు.
మహబూబ్నగర్ స్వతంత్ర శాసనసభ్యుడు రాజేశ్వర రెడ్డి హఠాన్మరణం పాలయ్యారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏడు శాసనసభా స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిలో ఒకటి ఆంధ్ర ప్రాంతంలో ఉండగా, ఆరు తెలంగాణ ప్రాంతానికి చెందినవే. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన స్థానాలే మూడున్నాయి. కాగా, స్పీకర్ తమ రాజీనామాలను ఆమోదించకపోవడంపై తెరాస, తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులు తప్పు పడుతున్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications