వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిబిఐ ఎదుట విజయసాయి, కోనేరు పిటిషన్ వాయిదా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vijay Sai Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సాక్షి వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి సోమవారం సిబిఐ ఎదుట హాజరయ్యారు. ఆయన గత ఏడాది డిసెంబరులో ఢిల్లీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట పలుమార్లు హాజరైన విషయం తెలిసిందే. కాగా ఎమ్మార్ కేసులో నిందితుడు కోనేరు ప్రసాద రావు వేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను కోర్టు జనవరి నాలుగో తేదికి వాయిదా వేసింది. కోనేరును సిబిఐ అధికారులు ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయ్యప్ప మాలలో ఉన్న ఆయన శబరిమలై వెళ్లడానికి నాలుగు రోజులు అనుమతి తీసుకొని వెళ్లారు. అనంతరం పోలీసుల ఎదుట లొంగి పోయారు. ఆ తర్వాత కోనేరు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

కాగా కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో నాలుగవ నిందితురాలైన ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మికి రాష్ట్ర హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఆమె బెయిల్‌ను రద్దు చేస్తూ హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 6వ తేదీలోగా సిబిఐ కోర్టు ముందు లొంగిపోవాలని హైకోర్టు ఆమెను ఆదేశించింది. డిసెంబర్ 2వ తేదీన ఆమెకు సిబిఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సిబిఐ కోర్టు మంజూరు చేస్తూ జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ సిబిఐ హైకోర్టుకు వెళ్లింది. దీనిపై వాదోపవాదాలు ముగిసిన తర్వాత హైకోర్టు సోమవారం తన నిర్ణయాన్ని వెలువరించింది.

English summary
Jagathi publication vice-chairman Vijay Sai Reddy attended before CBI today in YS Jaganmohan Reddy properties case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X