ఎమ్మెల్యే పదవికి జగన్ వర్గం పిల్లి సుభాష్ రాజీనామా

కాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమ నియోజకవర్గాలకు నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ జగన్ వర్గం ఎమ్మెల్యేలు గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా నియోజకవర్గంలో తమ ప్రాధాన్యత తగ్గించేందుకు ఇతరులను ఇంచార్జులుగా నియమించడం పట్ల కూడా ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేయడం ఇది రెండోసారి. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పేరును సిబిఐ ఛార్జీషీట్లో పేర్కొన్నారంటూ మిగిలిన జగన్ ఎమ్మెల్యేలతో సహా రాజీనామా సమర్పించారు. ఆ తర్వాత అవిశ్వాసం సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినందుకు వారిపై విచారణ కొనసాగుతోంది. ఈ సమయంలో జగన్ వర్గం ఎమ్మెల్యేల్లో ఆయన ఒక్కరే రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. ప్రత్యేకంగా నియోజకవర్గానికి నిధుల కేటాయింపులో వివక్ష చూపిస్తుండటం వల్ల ఇబ్బందులు ఎదుర్కోలేకనే ఆయన రాజీనామా చేశారంటున్నారు.












Click it and Unblock the Notifications