వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పద్మనాభుడి అనంత సంపద లెక్కింపు ప్రారంభం

By Pratap
|
Google Oneindia TeluguNews

Anantha Padmanabha Swamy
కొచ్చిన్: కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో వెలుగు చూసిన అనంతమైన సంపద లెక్కింపు సోమవారం ప్రారంభమైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ లెక్కింపు జరుగుతోంది. అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఐదు నేల మాళిగల్లో అంతు లేని సంపద బయటపడిన విషయం తెలిసిందే. సంపద విలువ 100 వేల కోట్ల మేరకు ఉంటుందని అనధికారిక అంచనా.

అనంత పద్మనాభ స్వామి ఆరో నేలమాళిగను తెరవాల్సి ఉంది. అయితే, దీని చుట్టూ వివాదాలు, ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఐదు నేల మాళిగల్లో బయటపడిన సంపదను లెక్కించిన తర్వాత ఆరో నేలమాళిగను తెరిచే విషయంపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని వెలువరిస్తుంది. ప్రపంచంలోని అత్యంత సంపద్వంతమైన అనంత పద్మనాభుడి సంపద లెక్కింపుతో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.

లెక్కింపును డిజిటలైజ్ చేయడానికి ప్రత్యేక యంత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. సంపద డిజిటల్ డాక్యుమెంటేషన్‌లు నెలలు పట్టే అవకాశాలున్నందున ఆలయం సంప్రదాయాచరణలకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తులను ఎప్పటిలాగే దర్శనానికి అనుమతిస్తారు.

English summary
The mammoth task of sorting out and documenting all the treasure found in Kerala's Sri Padmanabhaswamy temple began on Monday on the orders of the Supreme Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X