తెలంగాణ ఎజెండాగా మళ్లీ కాంగ్రెసు నాయకులు

తెలంగాణను అభివృద్ధి చేసినా ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్నే కోరుకుంటున్నారని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాజయ్య అన్నారు. ఈ విషయాన్ని తాము అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్తామని ఆయన విడిగా మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణ ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) విజయం ఊహించిందేనని ఆయన అన్నారు. తెలంగాణ ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉందని ఆయన చెప్పారు. నిజామాబాద్ జిల్లా మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా తెలంగాణ రాగం ఆలపించారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ఉప ఎన్నికలో తెలంగాణ సెంటిమెంటు బలంగా పనిచేసిందని ఆయన అన్నారు. త్వరగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని తాము పార్టీ అధిష్టానాన్ని కోరినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications