కిరణ్ కుమార్ ప్రభుత్వం కూలుతుంది: జగన్ పార్టీ నేత

ఇటీవల జరిగిన ఏడు నియోజకవర్గాల ఉప ఎన్నికల ఫలితాలు చూసి కాంగ్రెసు, టిడిపిలు చేతులెత్తేశాయని ఆ పార్టీ నేత గట్టు రామచంద్ర రావు హైదరాబాదులో అన్నారు. బాబు నిర్వేదంలో ఉన్నారన్నారు. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఉపాధి కల్పిస్తూ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తోందన్నారు. ఉపాధి హామీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. వారికి కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఉప ఎన్నికల తర్వాత కాంగ్రెసు పార్టీలో అల్లకల్లోలం ఖాయమని మరో నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వేరుగా అన్నారు. 18 స్థానాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందటం ఖాయమన్నారు. ఎస్పీఎస్ కొవూరు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో బాబు రూ.20 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. ఆయనకు అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications