జగన్ వర్గం కొండా, పుల్లా పద్మావతిలకు నోటీసులు

కాగా ఇదే అంశంపై ఎస్వీ మోహన్ రెడ్డి ఈ నెల ఎనిమిదవ తేదిన మండలి చైర్మన్ ముందు హాజరు కావాల్సి ఉంది. కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులు పదిహేడు మందిపై ఇటీవల వేటు పడిన విషయం తెలిసిందే. దీంతో త్వరలో ఆయా నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎమ్మెల్యేలపై వేటు అనంతరం కాంగ్రెసు పార్టీ ఇప్పుడు శాసనమండలి సభ్యులపై దృష్టి సారించింది.
కాంగ్రెసు పార్టీ ద్వారా ఎమ్మెల్సీలు అయిన జగన్ పార్టీ నేతలకు వరుసగా మండలి చైర్మన్ నోటీసులు జారీ చేస్తున్నారు. ఇందులో భాగంగా కొండా, పుల్లాలకు నోటీసులు జారీ చేశారు. కాగా తాను కాంగ్రెసు పార్టీ నియమ నిబంధనలు ఎక్కడా జవదాటలేదని కొండా మురళి ఇటీవల చెప్పారు. దీంతో ఆయన చైర్మన్ ముందు ఏం వివరణ ఇస్తారో చూడాలి.
అదే సమయంలో పుల్లా పద్మావతిపై వేటు పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఆమె ఇచ్చే వివరణతో చైర్మన్ సంతృప్తి చెందే అవకాశముంది. ఎందుకంటే మొన్నటి వరకు జగన్ పార్టీ వైపు ఉన్న ఆమె ఇటీవలే తాను కాంగ్రెసులోనే కొనసాగుతానని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాలన బాగుందని, అందుకే తాను తిరిగి కాంగ్రెసులోనే ఉండాలని భావిస్తున్నట్లు చెప్పారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్












Click it and Unblock the Notifications