తిరుపతిలో ఓటమికి కంట తడి పెట్టిన వెంకటరమణ

ఓటమిని తాను ఊహించలేదని వెంకటరమణ అన్నారు. అడిగినవారందరికీ తాను సహాయం చేశానని, అయినా ఓడిపోయానని ఆయన అన్నారు. వెన్నుపోటుదారుల వల్లనే తాను ఓడిపోయానని, పార్టీ నాయకుల నుంచి తనకు పూర్తి సహాయ సహకారాలు అందలేదని ఆయన అన్నారు. కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేసిన వెంకటరమణ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డిపై 17,823 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
తిరుపతి సీటును మంత్రి గల్లా అరుణ కుమారి తన కుమారుడు గల్లా జయదేవ్కు ఆశించారు. తన కుమారుడికి టికెట్ ఇప్పించుకోవడానికి ఆమె తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, ఆమె అందులో ఫలితం సాధించలేదు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చొరవతోనే వెంకటరమణకు కాంగ్రెసు అధిష్టానం తిరుపతి టికెట్ ఇచ్చిందని అంటారు.
రాజ్యసభకు ఎన్నికైన చిరంజీవి రాజీనామా చేయడంతో తిరుపతి శాసనసభా స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున చదలవాడ కృష్ణమూర్తి పోటీ చేశారు. వెంకటరమణ, చదవలవాడ కృష్ణమూర్తి ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం కూడా భూమన కరుణాకర్ రెడ్డి విజయానికి ఒక కారణమని అంటున్నారు.
-
భారీగా నిధులు విడుదల చేసిన టీటీడీ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications