ప్రణబ్కా, సంగ్మాకా: ఎన్డీయేలో కుదరని ఏకాభిప్రాయం

రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో వారు తీవ్రంగా చర్చించారు. అయితే అంతిమంగా ఓ నిర్ణయానికి మాత్రం రాలేక పోయారు. మరోసారి భేటీ అయి అభ్యర్థి విషయంపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో కాంగ్రెసు పార్టీ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీతో పాటు మాజీ స్పీకర్ సంగ్మా అభ్యర్థిత్వాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది.
ఎన్డీయేలోని కొన్ని పార్టీలు ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వంపై మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. మరికొన్ని పార్టీలు పిఎ సంగ్మా వైపు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. బిజెపి సంగ్మాకు మద్దతివ్వాలనుకున్నప్పటికీ శివసేన వంటి పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. దీంతో బిజెపి సంగ్మాకు మద్దతుపై వెనక్కి తగ్గింది. మిత్రపక్షాలతో చర్చించి సంగ్మాకు మద్దతివ్వడమా లేక ప్రణబ్ను బలపర్చడమా అలా కాకుండా కొత్త అభ్యర్థిని ప్రకటించడమా చేస్తారు.
ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తదితరులు పిఏ సంగ్మాకు మద్దతు పలుకుతున్నారు. ప్రణబ్కు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతివ్వవద్దని.. అభ్యర్థిని పోటీకి దించాలని ఎక్కువ పార్టీలు పట్టుబట్టినట్లుగా తెలుస్తోంది. కాగా ఎన్డీయే ప్రణబ్కు మద్దతిస్తే తాను రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తానని రాజ్యసభ సభ్యుడు రాంజెఠ్మలానీ చెప్పిన విషయం తెలిసిందే.
-
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
CSK vs RCB: ఓటమికి కారణమెవరంటే ? నిజాయితీగా చెప్పేసిన రుతురాజ్..! -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
పొంచి ఉన్న తుఫాన్ ముప్పు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
నరసాపురం To అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరే వేళ ఊహించని ట్విస్ట్..!! -
షాకిచ్చిన నటాషా.. హార్దిక్ లైఫ్లో ఊహించని ట్విస్ట్! -
గంటన్నారలో అమరావతి టు హైదరాబాద్, కేంద్రం కీలక నిర్ణయం..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
36 రోజులపాటు ఇంటర్నెట్ బంద్.. సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications