Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కిరణ్, బొత్సలదే బాధ్యతన్న కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్

Kishore Chandra Dev
న్యూఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్‌లో పరిస్థితి ఏమీ బాగా లేదని కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ బుధవారం అభిప్రాయపడ్డారు. ఆయన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఎపి రాష్ట్ర పరిస్థితులు, ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ ఘటనపై ఆయన సోనియాతో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పరిస్థితి ఏమీ బాగా లేదన్నారు. ఈ పరిస్థితికి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలు బాధ్యత వహించాలన్నారు.

రాష్ట్రంలో పునర్జీవానికి కాయకల్ప చికిత్స అవసరమని చెప్పారు. ఉప ఎన్నికలలో ఓటమికి రాష్ట్ర నాయకత్వం బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌ను సమర్థించలేమని కిషోర్ చంద్రదేవ్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. చిన్న పిల్లలు, మహిళలను కూడా ఎన్‌కౌంటర్ పేరిట చంపడం అన్యాయమన్నారు.

దీనిపై పూర్తి స్థాయి దర్యాఫ్తు జరపాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలను సమర్థించే ప్రసక్తే లేదన్నారు. ఛత్తీస్‌గఢ్ తరహా సంఘటనలు ఎక్కడ జరిగినా అది సమాజానికి మంచిది కాదని అన్నారు. గిరిజనులను పోలీసులు, మావోయిస్టులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. నైట్ విజన్ పరికరాలు వాడకుండా పోలీసులు చీకట్లో ఎలా కాల్పులు జరుపుతారని ప్రశ్నించారు. చీకట్లో గుడ్డిగా కాల్పులు జరిపి మైనర్లను ఎలా ఎన్‌కౌంటర్ చేస్తారన్నారు.

కాగా ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెసు ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. జగన్ పార్టీ 15 స్థానాలలో విజయకేతనం ఎగురవేయగా కాంగ్రెసు కేవలం రెండు స్థానాలలో గెలిచి చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా నిలిచింది. తెలుగుదేశం పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. పరకాలను తెరాస కైవసం చేసుకుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+