కిరణ్, బొత్సలదే బాధ్యతన్న కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్

రాష్ట్రంలో పునర్జీవానికి కాయకల్ప చికిత్స అవసరమని చెప్పారు. ఉప ఎన్నికలలో ఓటమికి రాష్ట్ర నాయకత్వం బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు. ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్ను సమర్థించలేమని కిషోర్ చంద్రదేవ్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. చిన్న పిల్లలు, మహిళలను కూడా ఎన్కౌంటర్ పేరిట చంపడం అన్యాయమన్నారు.
దీనిపై పూర్తి స్థాయి దర్యాఫ్తు జరపాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలను సమర్థించే ప్రసక్తే లేదన్నారు. ఛత్తీస్గఢ్ తరహా సంఘటనలు ఎక్కడ జరిగినా అది సమాజానికి మంచిది కాదని అన్నారు. గిరిజనులను పోలీసులు, మావోయిస్టులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. నైట్ విజన్ పరికరాలు వాడకుండా పోలీసులు చీకట్లో ఎలా కాల్పులు జరుపుతారని ప్రశ్నించారు. చీకట్లో గుడ్డిగా కాల్పులు జరిపి మైనర్లను ఎలా ఎన్కౌంటర్ చేస్తారన్నారు.
కాగా ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెసు ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. జగన్ పార్టీ 15 స్థానాలలో విజయకేతనం ఎగురవేయగా కాంగ్రెసు కేవలం రెండు స్థానాలలో గెలిచి చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా నిలిచింది. తెలుగుదేశం పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. పరకాలను తెరాస కైవసం చేసుకుంది.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications