వైయస్ హయాంలోనూ ప్రాబ్లమ్స్, బెదిరించి: శోభా
పక్క రాష్ట్రాలలో మనకంటే తక్కువ మంది ఎంపీలు ఉన్నప్పటికీ వారు కేంద్రాన్ని బెదిరించి పనులు చేయించుకుంటున్నారని, కానీ మన రాష్ట్రానికి చెందిన నేతలు మాత్రం ఇంతమంది ఉండి కేంద్రం నుండి పనులు చేయించుకోవడంలో విఫలమవుతున్నారని ఆరోపించారు. విద్యుత్ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. విద్యుత్ కొరత వల్ల రాష్ట్రంలో పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతున్నాయన్నారు. సాధారణంగా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల పిలుపుపై ప్రజలు ఆందోళన చేస్తుంటారని, అందుకు భిన్నంగా విద్యుత్ సమస్య పైన ప్రజలే తమంతట తాము స్పందించారన్నారు.
విద్యుత్ సబ్ స్టేషన్లను ముట్టడిస్తామని చెప్పారు. విద్యుత్ సంక్షోభం వస్తుందని ముందే తెలిసి కూడా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోలేదని మండిపడ్డారు. మన రాష్ట్రానికి రావాల్సిన గ్యాస్ తెచ్చుకోవడంలో కూడా ముఖ్యమంత్రి విఫలమయ్యారన్నారు. శాసనసభ సమావేశాలు తక్షణం ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై వెంటనే చర్చించాలని శోభా నాగి రెడ్డి డిమాండ్ చేశారు.