'రియాల్టర్' కిరణ్!: రింగ్ రోడ్డుపై స్టూడెంట్స్కు వార్నింగ్

రింగురోడ్డు పరిసర ప్రాంతాల వారి భూములకు మంచి గిరాకీ ఉంటుందని, ఎవరూ ప్రలోభాలకు లొంగి అమ్ముకోవద్దని విజ్ఞప్తి చేశారు. రింగు రోడ్డు వల్ల అత్యధికంగా లాభం రంగారెడ్డి జిల్లా ప్రజలకే అన్నారు. జిల్లాలో ఒక ఎకరా ఉన్న వారు కూడా కోటీశ్వరులయ్యారన్నారు. మీ స్థిరాస్తి మీ వద్దనే ఉంచుకోవాలని, ముందు ముందు మరింత మంచి భవిష్యత్తు ఉంటుందని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. జిల్లా దశ మారుతుందన్నారు.
విద్యార్థులు రింగు రోడ్డు పైన హద్దులు మీరవద్దని హెచ్చరించారు. జాగ్రత్తగా ఉండాలని కోరారు. పైరవీలు లేకుండా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తమదే అన్నారు. రోజుకు వెయ్యి ఉద్యోగాలను త్వరలో ఇస్తామన్నారు. అనంతరం ఆయన వ్యవసాయ, ఉద్యానవన, బిందు సేద్య రైతులతో మాట్లాడారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏడు గంటల పాటు ఉచిత విద్యుత్ అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు.
ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా శామీర్పేటకు సాగు, తాగు నీరు అందిస్తామన్నారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధిస్తామని చెప్పారు. విద్యుత్ తదితరుల సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని చెప్పారు. అనంతరం అక్కడి అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ముఖ్యమంత్రి తిలకించారు. జిల్లాలో నేటి నుంచి మూడు రోజుల పాటు సీఎం ఇందిరమ్మ బాట సాగనుంది.
-
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం












Click it and Unblock the Notifications