అక్బర్ సహకరిస్తానని చెప్పాడు: డిజిపి దినేష్ రెడ్డి
రంగారెడ్డి జిల్లా తాండూరులో మజ్లీస్ శనివారం తలపెట్టిన బహిరంగ సభకు ఏ విధమైన అభ్యంతరాలు లేవని ఆయన చెప్పారు. అత్యాచారం కేసుల్లో కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. రెండు నెలల్లోగా ట్రయల్ పూర్తయ్యేలా చూస్తామని ఆయన అన్నారు.
అక్బరుద్దీన్ ఓవైసీ లండన్లో చికిత్స చేయించుకుంటున్నట్లు ఆయన సోదరుడు, మజ్లీస్ అధినేత, హైదరాబాదు పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. అదిలాబాద్ జిల్లా నిర్మల్లో అక్బరుద్దీన్ ఓవైసీ చేసి ద్వేషపూరిత ప్రసంగంపై పలు చోట్ల కేసులు నమోదైన విషయం తెలిసిందే. పోలీసులు ఆయనను అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదిలావుంటే, అక్బరుద్దీన్కు హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 10వ తేదీన తమ ముందు హాజరు కావాలని వారు అక్బరుద్దీన్ను ఆదేశించారు. అక్బరుద్దీన్పై 153 (ఎ) సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. అక్బరుద్దీన్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం ఎబివిపి కార్యకర్తలు పోలీసు స్టేషన్ ముట్టడికి ప్రయత్నించిన విషయం తెలిసిందే.