ఎస్సై లైంగిక వేధింపు: లేఖరాసి మహిళాటీచర్ అదృశ్యం
వేధించవద్దని ఎస్సైతో చెప్పినప్పటికీ ఆపలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల వేధింపులు మరింత ఎక్కువయ్యాయని వారు అన్నారు. ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని లేదంటే చంపేస్తానని లీలను బెదిరించాడు. దీంతో ఎస్సై వేధింపులు తట్టుకోలేక రెండు రోజుల క్రితం లీల తాను చనిపోతానంటూ లేఖ రాసి అదృశ్యమైంది. ఈ విషయాన్ని నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమల రావు సీరియస్గా తీసుకున్నారు.
ఆయన వెంటనే ఎస్సైను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్ ఉత్తర్వులు జారీ అయినప్పటి నుండి ఎస్సై అజ్ఞాతంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలో పలుమార్లు ఎస్సై లీలను వేధించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సైను దుండిగల్ పోలీసు స్టేషన్కు బదలీ చేశారు. అక్కడకు వెళ్లినా ఎస్సై తీరులో మార్పు రావడంతో బుధవారం సాయంత్రం ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. ఎస్సై వేధింపులపై విచారణ జరిపించడంతో నిజమేనని తేలింది.
లీల ఆచూకి కనుగొనాలని కుటుంబ సభ్యులు పోలీసులను కోరారు. ఆమె ఆచూకీ దొరకకపోవడం తమను ఆందోళనకు గురి చేస్తోందన్నారు. లీల భర్త బుధవారం సైబరాబాద్ కమిషనర్ దృష్టికి ఎస్సై వ్యవహారాన్ని తీసుకు వెళ్లారు.