పాక్ ఐఎస్ఐకి పేలుళ్ల గుట్టు చెప్పిన ఎన్ఎస్జీ అధికారి

ఈ ఘటన కొద్ది రోజుల కిందట జరిగిందని, దీనిపై అంతర్గతంగా దర్యాప్తునకు ఆదేశించామని ఎన్ఎస్జీ అధిపతి అరవింద్ రంజన్ తెలిపారు. ఎన్ఎస్జీ అధికారి, పాకిస్థానీ మధ్య సంభాషణ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కీలక వివరాలను వెల్లడించలేదని తెలిపారు. పాకిస్థానీని ఐఎస్ఐ ఏజెంట్గా భావిస్తున్నామన్నారు.
ఫిబ్రవరి 21న దిల్సుఖ్ నగర్లో బాంబు పేలుళ్లు జరిగిన వెంటనే కేవలం మూడున్నర గంటల్లోనే ఎన్ఎస్జీ అధికారులు హైదరాబాద్కు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, పేలుళ్ల స్థలానికి ఎన్ఎస్జీ బృందం కదలికల గురించి సదరు అధికారి ఐఎస్ఐ ఏజెంటుకు వివరించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అంతే తప్పితే, పేలుళ్లకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఏవీ తెలియజేయలేదని వివరించాయి. వాళ్లిద్దరూ ఫోన్లో మాట్లాడుకున్నారని, కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు దీనిని కనుగొన్నారని, వారి సంభాషణ వివరాలను ఎన్ఎస్జీ ప్రధాన కార్యాలయానికి వివరించారని ఆ వర్గాలు తెలిపాయి.
అయితే, నిఘా, భద్రతా సంస్థల్లో ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉంటాయని, గుర్తు తెలియని వ్యక్తులతో ఫోన్లో కానీ, వ్యక్తిగతంగా గానీ, ఇంటర్నెట్ తదితర సమాచార సాధనాల్లో కానీ మాట్లాడవద్దని అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తూనే ఉంటారని ఆ వర్గాలు వివరించాయి.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications