కెవిపి తర్వాత వరుసగా: జగన్ కేసులో సిబిఐ దూకుడు

అలాగే సూరీడుతో సన్నిహితంగా మెలిగే వారి గురించి కూడా ఆరా తీసినట్లు సమాచారం. జన్నత్ను ఆయన ఇంట్లోనే ప్రశ్నించిన దర్యాప్తు అధికారులు ఐపిఎస్ అధికారి రమేష్ రెడ్డిని దిల్కుషాకు పిలిపించి గంటన్నరపాటు విచారించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సిబిఐ కొద్ది రోజులుగా పలువురిని ప్రశ్నిస్తోంది. ఇటీవలే వైయస్ ఆత్మబంధువు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావును ప్రశ్నించింది.
తాజాగా వైయస్ వ్యక్తిగత సహాయకులుగా పని చేసిన అధికారుల నుంచీ సమాచారం సేకరిస్తోంది. వైయస్ హయాంలో జన్నత్ హుస్సేన్ ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక అధికారి. కెవిపి, జన్నత్కు తెలీకుండా వైయస్ రాజశేఖర రెడ్డి ఏమీ చేసేవారు కాదనే వాదన ఉంది. వైయస్ వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన భాస్కర శర్మను రెండు రోజులుగా సిబిఐ ప్రశ్నించింది. రమేష్ రెడ్డిని గురువారం ప్రశ్నించారు.
కాగా, తాను హైదరాబాద్ కార్యాలయం వరకే పరిమితమని భాస్కర శర్మ చెప్పడంతో ఇడుపులపాయ, పులివెందులలో ఎవరెవరు కలిసేవారో, ఏ విషయాలు మాట్లాడేవారో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్కు వివరంగా తెలుసని భావించిన సిబిఐ.. రమేష్ రెడ్డి నుంచి పలు కీలక విషయాలు రాబట్టినట్లు తెలిసింది. అపాయింట్మెంట్ లేకుండా వచ్చి వైయస్ను కలిసిన పారిశ్రామికవేత్తలు, నేతలు, దళారీల వివరాలను రాబట్టిన సిబిఐ.. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని భాస్కర శర్మ, రమేష్రెడ్డికి స్పష్టం చేసినట్లు తెలిసింది. దశరథ రామిరెడ్డిని కూడా ప్రశ్నించింది.
-
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!!












Click it and Unblock the Notifications