700 మంది కూలీలు అక్రమంగా ప్రవేశించారు, మిలియన్ జనాభాకు 3 వేల పరీక్షలు: ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పరీక్షలు ఎక్కువ నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. కరోనా పరీక్షల నిర్వహణలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉందన్నారు. వైరస్ పరీక్షల కన్నా.. డిశ్చార్జీ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. కరోనా వైరస్ నివారణ చర్యలపై సీఎం జగన్ శనివారం అధికారులతో సమీక్షించారు.

మిలియన్ జనాభాకు 3 వేల పరీక్షలు..
రాష్ట్రంలో మిలియన్ జనాభాకు 3 వేల 91 పరీక్షలు నిర్వహిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఇప్పటివరకు లక్ష 65 వేల 59 మందికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు. శుక్రవారం ఒక్కరోజే 8 వేల 388 మందికి పరీక్షలు చేశామని చెప్పారు. కరోనా వైరస్తో మరణాలను అరికట్టడంపై దృష్టిసారించామన్నారు. వైరస్ సోకిని ప్రతీ ఒక్కరికీ మెరుగైన వైద్యం అందిస్తామని వెల్లడించారు.

ఎవరూ చనిపోతున్నారంటే..
దీర్ఘకాలిక వ్యాదులతో బాధపడుతున్నవారే చనిపోతున్నారని పేర్కొన్నారు. చెన్నై కోయంబేడు మార్కెట్ నుంచి వచ్చినవారిపై ఫోకస్ చేశామన్నారు సీఎం జగన్. 700 మంది కూలీలు అనుమతి లేకుండా రాష్ట్రంలోకి ప్రవేశించారని జగన్ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారితో కరోనా ప్రభావం ఉంది అని చెప్పారు. టెలీ మెడిసిన్పై ఫోకస్ చేశామని.. రోగులు కాల్ చేసిన 24 గంటల్లో ఔషధాలు అందించేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.

11 చెక్ పోస్టుల వద్ద
రాష్ట్ర సరిహద్దుల్లోని 11 చెక్ పోస్టుల వద్ద వైద్య పరీక్షలు చేసేందుకు ఏర్పాటు చేశామని సీఎం జగన్ తెలిపారు. సరిహద్దు దాటి వచ్చేవారికి థర్మల్ స్కీనింగ్ పరీక్షలు చేస్తామని తెలిపారు. విశాఖపట్టణంలో గ్యాస్ లీకైన ప్రాంతాల్లో పశువులకు చికిత్స అందిస్తున్నామని చెప్పారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications